ప్ర ధ మా శ్వా స ము
39
ఆ॥ వే॥ యుదలకు సింహుఁ దెచ్చియుర్వీశ్వరుని జేసె
సోనెగుఱ్ఱ విభుఁడు సుగుణరాశి
యఖిలసింహుడు సుత నా కరుణాదేవి
విభవ యుక్తి నొసఁగి పెండ్లి చేసె. 158
సీ॥ విలయ రణక్షేత్రముల సర్వ సేనాధి
నాధుఁడై యెవఁడు సైన్యముల నడుపు
నఖిల సామంత గోత్రాధీశు రెవ్వాని
యాజ్ఞ లౌదఁల దాల్చి యవధరింత్రు
నృపమౌళి రాజధానినిదాఁట రాణివా
సము రాజ్య మెవని పోషకత నిలుచుఁ
బరమ శిశోదియాన్వయ భూపతుల నిల్ప
నడఁప నెవ్వాడు సర్వాధికారి
గీ॥ యెవని యనుమతిలేక ధాత్రీశుఁ డష్ట
సచివు లుద్యోగులెల్ల మాషప్రమాణ
మవని దానంబు చేయ యోగ్యతయె కాంచ
రతఁడు సామాన్యుఁడే సలుంబ్రాధినేత 159
మ॥ పదమూఁడేడుల చిన్ని లేవయసు మేవాడ్రాజ్య భారంబునున్
గుదురై మోచేడు వీరులెందఱో నిజాంఘ్రుల్ గొల్త్రు ఢిల్లీశుఁడున్
సదయాంతః కరణుండు నేర్పుమెయి రాజ్యంబేలు నాసక్తి పెం
పొదవన్ బోక జడాత్ముఁడై యుదయసింహుండుండె భోగాప్తిమై. 160
మ॥ సమరోత్సాహము లేదు విక్రమకళాసంపత్తియు లేదు దు
ర్దమ ధైర్యోన్నతి లేదు చిత్తురు మహారాజ్యంబు పాలింపఁ బూ
జ్యమయౌ సద్గుణ మొక్కఁడేనియు రహించన్ బోదు వైయాఘ్ర గ
ర్భమున మేఁక విధంబునన్ బొడమె సంగ్రామేంద్రు గర్భమునన్.161
మ॥ ఉదయాస్తాచల మధ్యగంబగు జగంబుఱ్ఱూఁత లూఁగించె బె
ట్టిదుఁడౌ పుత్రుఁడు ఘోర సంగర కిరీటిప్రాయుఁడై కీర్తి సం
పద నార్జించెను తండ్రి యెట్లితఁడు మేవాడ్రాజ్య మందార శా
ఖిఁ దినన్ జొచ్చిన పుప్పియట్లు వొడమెన్ గీర్తిన్ గళంకించుచున్.162