పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర



    బున్నాయనెడి దాది ముందెంట్లొ సడినట్టి
             యొకపూల బుట్టలో నుదయసింహు
    నుంచి భటులవెంట నూరివెల్పలికంపి
             తనపుత్రునుంచెఁ దత్థ్సానమందు:
    వనవీరుఁ డుదయసింహుని జూపుమని వచ్చెఁ
             సతి నిజాత్మజుఁ జూపె నతఁడుపొడిచె

గీ॥ బుత్ర శోకంబు దిగమింగి పున్న వెడలి
    స్వామి నొడినుంచి దేశ దేశములు తిరిగి
    వర్తకుం 'డసాసా' కడ వానిఁ జేర్చి
    సకల లోకైక విఖ్యాతి సంతరించె! 155
    
క॥ తను నెంత కాచి కుడిపినఁ
   దనసుతుఁ బరుసుతుని కొఱకు దారుణ ఖడ్గం
   బునఁజీల్పఁ గనిన వెలఁదుల
   వినియుంటిమె పున్నదక్క వేఱొకదానిన్. 156
   
క॥ వనవీరుఁడు దాసీనం
   దనుఁడును హంతకుఁడు సాహిదా పర్హుండౌ
   జనపతి లేమి మహీ పా
   లన మతఁడొనరింప నెగ్గులన్ గనకుండెన్.157
   
ఉదయ సింహుడు రాణాయగుట.

సీ॥ పాలించె నతఁడు మేవాడ్దేశ మైదేడు
         లొక వత్సరము వసంతోత్సవములు
   సకల వైభవముల సాగు పిదప వన
         వీరుఁడు సామంత విభులఁజేర్చి
   కోసుఁడు ప్రసాద మంచని తొందరించె, స
         లుంబ్రాధిపతీ కోపలోహితుఁడయి
   యఖిల ప్రజాగణం బభినుతుల్' నేయంగ
         వాని సింహాన భ్రష్టుఁజేసి.