ప్ర ధ మా శ్వా స ము
37
గీ॥ నా మహాసేనఁ జూని, భయంబు లేని
నీరు సోఁకు నుప్పువలెఁ గన్పింప కేగె
బలముతో బహదూరు మాధ్వమును ఘూర్ణ
రము హుమాయూన్ జయించె సైన్యముల నుంచె 151
గీ॥ పూన్కి చెడి దేశములు వట్టిపోయి నట్టి
వెకలి ఎక్రమ సింహుని వెదకి తెచ్చి
సింహ పీఠిఁ బునఃప్రతిష్ఠితుని జేసి
దీవెనలు పోసి ఢిల్లీకిఁ దెరలిపోయె. 152
సీ॥ జననమో పటుతురుష్క నృపాల కులమున
భావమో రాజ్య సంపాదనంబు
ప్రాయమో సకల ప్రపంచంబు తనదని
పోరాడ వలసిన పూర్ణ వయసు
అరిది రాజస్థాన మాకర్షకము కాని
రాణి యర్ధింప సౌభ్రాత్ర మూని
వంగభూమిని దనపని మాని యొక వేయి
మైళ్ళేగుదెంచి ధర్మము వరించి
గీ॥ స్వకులు బహదూరు శిక్షించిపంచి దేశ
మందు భయమును డించి సౌఖ్యంబు నించి
వట్టి చేతులు వెనుకకువచ్చె నెట్టి
సరళ హృదయుండొ హుమయూను చక్రవర్తి. 153
-:మేవాడకు వనవీరుఁడు పాలకుఁడగుట:-
మ॥ ఒకయేడాదిగ రాజ్యమేల్కొనెనొ లేదో యెల్లసేనాధినా
యకులన్ బాధల ముంచె నీకృతి సలుంబ్రాధీశుఁ డాత్మగా సహిం
పక రాజ్యచ్యుతుఁజేసి విక్రముని మేవాడ్దేశ మేలంగఁ బూ
నికమీఱన్ వనవీరుఁ దెచ్చి నిలిపెన్ సింహాసనం బందునన్. 154
సీ॥ వనవీరుఁ డవని పాలన మశాత్రవము సే
య సుదయసింహుఁ గూల్పను దలంచెఁ