పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర




మ॥ స్ఫురదిందీవర నేత్రలార! యిదె నాపుణ్యంబు వర్ణింపఁగాఁ
    దరమే! నేఁటివిపత్తు దీర్చుటకు నింద్రప్రస్థమేయైన భా
    గ్య రమాక్రాంతము నాదు రాజ్యమయినన్ గాదేని నాప్రాణ మా
    పరమోత్కృష్టగుణాఢ్య పాదము కడన్ భక్తిన్ సమర్పించెదన్ 146
    
మ॥ ధర పుట్టొందిన దాది నిందనుక నే తౌరుష్క భూపాలుఁడీ
    భరతోర్విన్ బడయంగఁ జాలని కడున్ బ్రత్యేక మర్యాద కా
    కరమైతిన్! భువన ప్రపూజ్యయగు నా కర్ణావతీదేవి స
    చ్చరణాబ్దంబులు జన్మజన్మమును నే సద్భక్తి సేవించెదన్" 147
    
మ॥ అని అత్యుత్తమ భక్తి భావరతితో నవ్వారి పాడింబులన్
    దన శీర్షంబిడి మ్రొక్కి వీడ్కొలిపి యాధన్యాత్ముఁడున్ జైత్రయా
    త్రను జాలించి యపార సైన్యసముదగ్రక్షాత్ర విస్ఫూర్తి బో
    రన బృహ్మాండము వ్రక్కలై పడఁగఁ జేరన్ బాఱె ఢిల్లీ దెసన్. 148
    
మ॥ చని వైనంబునెఱింగి యక్కటకటా! సర్వంబున్ మించి పో
    యెను! దుర్గం బరిచేతఁ జిక్కెను బలంబెల్లన్ నశించెన్ గృపా
    ఖని నన్గోరిన దొడ్డతల్లియగు నాకర్ణావతీదేవి యే
    మని చింతించెనౌ! మందభాగ్యునకు నేలాదక్కు తత్సేవనల్. 149
    
మ॥ అకటా! సూర్యుఁడు వంశకర్తయఁట క్షీరాబ్ధిన్ వలెన్ బూజ్యమై
    యకలంకంబగు గొప్పవంశమఁట ధన్యాత్ముండు సంమ సిం
    హు కుటుంబంబఁట! సుంత సాయపడఁగా నొక్కింత తావున్నఁ బా
    యక మత్కీర్తి వెలింగియుండు గద బ్రహ్మాండైక సుస్థాయిగన్ 150
    
సీ॥ ఆతల్లి బదులు తదాత్మజుఁ గొలిచి దే
           హము ధన్య మొనరింతు నని తలంచి
    చిత్తూరుపురి విసర్జించి ఘూర్ఖర మేగు'
           మని బహదూరున కాజ్ఞఁబంపె
    నామూర్ఖుఁడు తదాజ్ఞ నౌదలఁ దాల్పక
           సమర సన్నాహమున్ జరుప దొడఁగె!
    బాదుసా తుదిలేని బలములతో దుర్గ
           మును నాల్గువైపుల ముట్టడించె!