పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర ధ మా శ్వా స ము

41




   మొదటి పిరంగి చప్పుడయి నంతనే గుండె
             లవిసి నీరయి కొంద ఱవలి కుఱుుక
             
గీ॥ నా హుమాయూను త్రోవలో నడ్డమైన
    జనులఁ జేర్చి చేకూర్చిన నైన్యమెల్లఁ
    జేయి జారిన కడవయై ఛిన్న మయ్యె
    షేరుఖాన్ ఢిల్లీ పట్టాభిషిక్తుఁ డయ్యె 168
   

మ॥ చమువుల్ లేక మహామహీవలయ రాజ్యం బూడిపోవంగ నా
    హుమయూనున్ వెనువెంటనే తగిలి లాహోర్ దాఁకఁ బోనీక నై
    న్యములన్ దోడ్కొని షేరుఖాను దఱిమెన్ వాఁ డంతటన్ దేశ దే
    శముల గ్రుమ్మరే నేచ్చటేనిఁ దలఁదాచన్ వచ్చు నంచాసతో. 169
    
మ॥ స్తిమితత్వంబు వహింపకేగి యొకచో 'షేకల్లి' యక్ బార సీ
    కమహాయోగిని గాంచి యాతఁ డడుగంగాఁ దెల్పె నాత్మీయ వృ
    త్తముఁ దత్సన్నిధి నున్న వానిసుత 'యుద్వాహమ్ము గావించు కొం
    దు మహాభాగుని వీనినే నన నతండున్ వానికిచ్చెన్ సుతన్ 170
    
సీ॥ ఏలుటకు మహా మహీవలయము లేదు
             కొలువు సేయఁగ భటకోటి లేదు
    కాంచనాదిక ధనగ్రామంబులును లేవు
             సముదార దివ్యభోగములు లేవు
    వసియింపఁగా దొడ్డభవనంబులును లేవు
             తాల్ప ననర్ఘ వస్త్రములు లేవు
    వాహ్వళి యొనరింప వాహనంబులు లేవు
            శ్రమ దీఱ గంట విశ్రాంతి లేదు

గీ॥ కేవలము హుమాయూన్ పడుక్లేశ మెంచి
    మనసు గరగించు సౌజన్య మహిమ నెంచి
    కోరి యర్ధాంగమును బంచుకొనియె నెట్టి
    పావనాత్మికయో హమీదా వధూటి. 171

మ॥ వనిత యోధులఁ గొంచు యోధపురికిన్ వచ్చెన్ దలన్ దాఁప వ
    ద్దనెఁ దన్నేత జసల్ మియర్ ప్రభువు పొమ్మంచాడె మార్వార్ నృపుం