ప్ర ధ మా శ్వా స ము
23
టను గూర్చుండుచుఁ బెండ్లిపేరఁటము మాటల్ మాని దుర్వార మృ
త్యునిభుండై చను మూంజునిన్ దొడరఁ బొండో యంచు వేధింతువే.86
ఉ॥ కాటికిఁగాళ్ళు చాచితివి కావలెనన్నను మూంజుతోడి పో
రాటము నీవె చూచుకొను మాడకు కాఱులు నిన్నుఁ జూచినన్
బోటులుగూడ నవ్వెదరుపొమ్మ" ని పల్కిరి చెంత నొక్కచో
నాటలమున్గి పై విషయమంతయు విన్న హమీరసింహుడున్. 87
ఆ॥వే॥ ఆయజేయసింహం ననుజుని కొడుకు ప
దేండ్ల బాలుఁ డటకునేగు డెంచి
చేతనున్న చిన్న సింగాణితో బాణ
సమితితో ధరిత్రిఁ జాఁగి మ్రొక్కి. 88
క॥ 'ఒక యశ్వము నొక కుంతము
నొక ఖడ్గము నిచ్చి పంపుమో తండ్రీ! త
ప్పక చని నే మంజూవి మ
స్తకముఁ దఱిగితెచ్చి యుంతుఁ జరణాబ్దములన్. 89
చ॥ అనుచు నుదారవీరరస మచ్చుపడన్ వచియించు చిన్న నం
దనుని నజేయసింగు గవి "తండ్రి! భవద్వచనంబు కోటి సే
యును చని నీవు పై రిశిరమూడిచి తెచ్చిన యంత సంతసం
బొనరెను నీవుపోవలవ దుండుము నాకడ' నంచుఁ బల్కినన్. 90
మ॥ "ఇదె తండ్రీ! పలుమాటలే నెఱుఁగరెండేమార్గముల్ నాకు నీ
మదవద్వైరిని భిల్లునిన్ దునిమి, తన్మస్తంబును దెచ్చి నీ
పదముల్ చేర్చెదన్ లేనిచో మఱల మేవాడ్దేశమం దెందు నా
పదమున్ మోపక దూరసీమల వసింపగా బోదు" నంచాడుచున్. 91
గీ॥ అంతనొక ఖడ్గమొకకుంత మశ్వముఁ గొని
గాలి కన్న హమీరు శీఘ్రముగఁ బోయెఁ
జనె దినములు పక్షములు మాసములు గడచే
నతఁడు చనుటేరికిని జ్ఞప్తియందెలేదు. 92