పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర


నొకరిదేశము పైన నొకరుఁడు దండెత్తి
            పలుమాఱు పోరుట వాడుకయ్యెఁ
గీ॥ శైలవారా మహాటవుల్' కదిసి వేట
    సలుపుచో వారువీరును గలిసిరేని
    నిరు దెగల నాయకులను నిర్వురో కడకు నొ
    కరుఁడొ మడియుట తప్పక జరుగుచుండె. 82
   
సీ॥ చిత్తూరు రాజ్య మజేయసింహుం డేలు
            చుండి యోలగముండి యొక దినమున
    నాత్మజుల్ సుజన సింహాజిత సింహులఁ
            బదునేను బగునాల్గు వత్సరముల
    వారలఁ గని భిల్లపతిమూంజుఁ డెనిమి దేం
            డ్లకుముందు వనమున నన్నుఁ దాఁకె
    వానిఁ దప్పుకొన నుపాయములేక య
           ఱ్ఱాడితి విడక వాఁడట్టె పొదివి
గీ॥ కుంతమునఁ గ్రుమ్మెఁ దలనాటి గొప్ప గాయ
   మయ్యె నాయాయువది గట్టిదగుట నెట్లొ
   పురముఁ జేరితి నేటికి శిరము నిమురు
   చో నిదిగొఁ బెద్ద గుంట చేసోఁకుచుండు. 83
   
క॥ నాఁ డదరిన యీ గుండియ
   నేఁడును దిటవూన దతఁడు నిదుఁర గనఁబడున్
   వాడి సగమైతి మూంజుని
   గూడిన పగఁ బయికిఁజెప్పుకోన లేకుంటిన్. 84
   
మ॥ చతురంగ ధ్వజినీపతుల్ గొలువఁగా సన్నాహ సర్వాయుధాం
    చితులై మూంజుని గూడెమున్ దఱిసి తచ్ఛీర్షంబు ఖండించి యా
    ప్తతతో నాభయ ముజ్జగింపు డనుచున్ దైన్యంబుతోఁ బల్కఁ ద
    త్సుతులున్ లేనగ వాస్యబింబముల యందున్ బెల్లు తొల్కాడఁగన్. 85
    
మ॥ "తనియన్ బిల్లలఁ బాపలన్ గని ధరాధ్యక్షుండపై భోగ భా
    గ్యనికాయంబులమాఁగి వృద్దవగు నీవానంద సంపత్తి నిం