ప్ర ధ మా శ్వా స ము
21
క॥ వీరావేశము పొంగఁగఁ
దౌరుష్క భటాళిఁదగిలి తలలు నఱకుచున్
గోరాసిం గనిఁ బడియెను
వారిధిఁబడి య స్తమించు వనజాప్తు క్రియన్. 77
క॥ బాదూలుసింగు బాలుఁడు
ద్వాదశ వర్షములవాఁడు తౌరుష్కుల శౌ
ర్యోదయుఁడై తునుమాడుచు
నాదిన మొక్కరుఁడె యింటికరుగఁగఁ గలిగెన్. 78
మ॥ అమితోత్సాహముతోడఁ బోరెనఁగఁగా నానాఁడు మేవాడ రా
జ్య మహాసౌధమునందు స్తంభముల యోజన్ బొల్చు లోకైక వి
క్రమ ధౌరేయుల నొక్కఁడేని మిగులంగాఁ బోక సంగ్రామ రం
గమునన్ వీరవిహారముల్ నెఱపి స్వర్గంబేగి రొక్కుమ్మడిన్. 79
చ॥ పడతులు వేవురు గొలువఁబద్మిని వహ్నిని జొచ్చే: వైరులున్
గుడులును రాజసౌధములు గోపురముల్ కొలువుల్ గృహంబులున్
బుడమిఁ బడంగఁ జేయఁ బురమున్ సిరి దప్పె గజంబులున్ జొరం
బడి కలఁపన్ గలంతపడు పద్మసరః ప్రవరంబు చాడ్పునన్. 80
మ॥ అనహుల్ వారయి బూంది దేవగిరి ధారావంతులున్ మారు వా
రును డాండూపుర మాజసల్మియరు గోగ్రన్ దేశముల్ పెక్కు లొ
య్యన నొక్కొక్కఁడుగాఁ దురుష్క నరపాలాధీశ్వరున్ గొల్చి యా
తని రారాజుగ సమ్మతించెఁ బరతంత్రత్వంబుమైఁ గ్రుంగుచున్. 81
అజేయ సింహుని పాలనము
సీ॥ బహుకాలమునకుఁ బూర్వమున రాజస్థాన
వసుధయంతయు భిల్లవంశజులది
దారి దూరముతోలి బప్పరాయ నృపాలుఁ
డధికుఁడై మేవాడ నాక్రమించె
నదిమొదల్ బిల్లుల కారాజపుత్రుల
కణఁగని వైరాగ్ని యతిశయిల్లె