పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర


    బలశౌర్వయుతుఁడు సింహళరాజ్య మేలు హ
            మీరశంకరుని యర్మిలి తనూజ
    చతురబ్ది వలిత విశ్వధరిత్రిఁగల తలో
            దరులందు మేటి సౌందర్య రాశి
            
గీ॥ యైన పద్మినిఁ బెండ్లాడె నామె యశము
    దేశమెల్ల నిండెను రాజ్యతృష్ణకన్న
    నంగనాతృష్ణ యెక్కు డౌ యవనవిభుఁడు
    తరుణిఁగోరి చిత్తూరిపై దండు విడిసె. 73
   
మ॥ ఒకసంవత్సర మాఱుమాసము లలాయుద్దీసు దుర్గంబు సై
    న్య కదంబంబులతోడఁ జుట్టుకొనుచున్ సంగ్రామమున్ జేసి యిం
    చుక గెల్పొందఁగ లేక తీరని వ్యధన్ శోషిల్ల సాగెన్; లటూం
    తకులై పోరిరి రాజపుత్రు లసమానక్షాత్ర దీక్షారతిన్.74
    
సీ॥ కడకుఁ 'బద్మినిఁజూప విడుతుముట్టడి' ననె
            యవనేంద్రుఁ 'డద్దంబు సందుఁజూడు'
    మని రాజపుత్రకు లని రలాయుద్దీను
            విచ్చేసి సతిఁజూచి వెనుక కరుగు
    నప్పుడు భీమసిం గరిగె వీడ్కొల్పుచుఁ
            గోటదాఁటఁగఁ దురుష్కులతనిఁ జెఱఁ
    బట్టి 'పద్మిని నీయవదలెద' మని రేడు
            వంద లాందోళికల్ బయలుదేఱె
            
గీ॥ వెలఁదిఁ గడసారి దర్శింప భీమసింగు
    పంపఁబడె నాతఁ డశ్వంబుపైనఁ గోట
    దూఱె యవనుల్ విజృంభించి దూఁకిరపుడు
    రాజపుత్రులు పోరి రబ్రంబుగాఁగ. 75

మ॥ స్థిరమౌ సత్ప్రభుభక్తియుక్తి నిజరాజ్జీ మాన సంత్రాణ ధ
    ర్మరసావేశము పొంగి పైఁబొరల గోరాసింగు బాదులు సిం
    గు రణాగ్రంబున వైరి వీరుల తలల్ గోటానఁ గోట్లున్ వసుం
    ధరరాలన్ విహరించి రయ్యెడఁ గృతాంత ప్రాయులై యిర్వురున్. 76