ప్ర ధ మా శ్వా స ము
19
ఉ॥ జంబవిరోధి వైష్ణవ విశాలత భూప్రజ నేలి శాశ్వతో
జ్జృంభిత కీర్తి చంద్రికలఁజిమ్ముచు వాఁడు 'కుటుబ్; మినార్' శిలా
స్తంభము నొక్కదాని జయసంభృతమై పొలుపొంద నిల్పెవి
శ్వంభరఁ బొల్చు నయ్యదియు సప్తవిచిత్రము లందు నొక్కఁడై.67
మ॥ పరిపాలించిరి వానివెన్క ధరణీభాగంబుఁ బెక్కుర్ నృపా
లురు: ఖిల్జీకులుఁ డొక్కఁడాదట జలాలుద్దీను దుస్తంత్ర ము
ష్కరుఁ డుండిన ఢిల్లిరాజు శిరమున్ ఖండించి యేత త్పురీ
వరమున్ జేకొని రాజ్య మేలఁ దొడఁగెజా బట్టాభిషిక్తుండునై. 68
క॥ అవల సలాయుద్దీనను
యవనుండు పరాక్రమక్ర మాటోపుఁడు పా
ర్థివుఁ డయ్యె దేశమంతయుఁ
దవిలి వసము చేసికొన సతఁడు గాంక్షించెన్. 69
గీ॥ సమరకోవిదుఁ డతఁడు మాళ్వమును దేవ
గృహమును విహారదేశమ్ముగెలిచి తృప్తి
పడక లయకాలరుద్రుని పగిది వెడలి
యల రణస్తంభపుర దుర్గమాక్రమించె. 70
మ॥ కమలాదేవి రతిస్వరూప యని యాకర్ణించి యాతండు సై
స్యముతో ఘూర్జరదేశ మేగి యనిలోనన్ దన్మహీనాధు జీ
వములన్ బాపి లతాంగిఁ జేకొనియె: నాపై నాసియా మధ్య భా
గమునందుండియు వచ్చి ఢిల్లిపురి లగ్గల్ వట్టి రామోగలుల్. 71
మ॥ ఉరుశౌర్యంబునఁ బెక్కు మాఱులు సలాయుద్దీను మోగల్ రిపూ
త్కరమున్ యుద్ధములందు మార్కొనుచు స్రుక్కన్ జేసి మోదించెఁ బా
ఱిరి స్వస్థానముఁజేర వారు భరతోర్విన్ వీడి ఢిల్లీశుఁడున్
ధరణీరాజ్వము వృద్ధిచేసికొను చందం బెంచుచుండెన్ మదిన్. 72
సీ॥ మేవాడరాజ్య లక్ష్మీనాధుఁడయిన ల
క్ష్మణసింగె బాలుఁడౌ కారణమున
భీమసిం గాతని పినతండ్రి ప్రతినిధి
యగుచు రాజ్యము నేలెనతఁ డశేష