పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర

మ॥ తొలుతన్ సాయము చేసినట్టి జయచంద్రున్ దాఁకె ఘోరీయు; దు
     ర్బలుఁడై రాజ్యము వాఁడు వీడిచనెఁ; దార్తార్ వీరులుగా వెంబడిన్
     గలయన్ దూఁకిరి; దిక్కులే కతడు గంగావాహినిన్ దూఁకి య
     వ్వలి కేగెన్; దలఁద్రుంచి చంపిరి రిపుల్ వైవస్వతప్రాయులై 62
    
సీ॥ ప్రార్ధింతు వలవ దీపని” యంచు సంయుక్తి
             కొనకాళ్లఁబడి వేడుకొనిన వినక
     ఘోరీని బిలిపించి కొంప కగ్గి ఘటించి
             నృపచంద్రు సమరసింహేంద్రుఁ దుంచి
     పృధ్వీశు నట్టేటనిడి కుంకుమూడ్చి సం
             యుక్త వైధవ్య సంయుక్తఁజేసి
     యుర్వి యున్నంతకు నుగ్రాపకీర్తియై
              రాజ్యంబు పారతంత్య్రమున నడితె!
              
గీ॥ కటకటా కోటియుగములు గడచుఁగాక
     పృథ్వివిభువంటి రాజరా జెటులఁ గలుగు
     భరతభూమి స్వాతంత్య్రమెబ్బంగిఁ బొలుచుఁ
     జెనఁటి జయచంద్ర: నిబిడ దుష్కీర్తి రుంద్ర!63
     
గీ॥ "చెట్టుపై బక్షిశిరమును జెండు" మనినఁ
    బృథ్విరాజు మూఁడు శరంబులెత్తి పులుఁగు
    గళము దానివెంటనే ఘోరీగళము ద్రుంచి
    యాత్మహృదయమ్ము భేదించి యరిగె దివికి.64
    
గీ॥ పృధ్వినృపమౌళి గృహము ఘోరిగృహంబు-
   నమరసింహు గృహము జయచంద్రు గృహము.
   నాల్గు గృహములు మొదలంట నాశ మయ్యె
   దుష్టుఁడగు నొక్క దేశ విద్రోహి కతన.65 65
   
క॥ కుతుబుద్దీన్, సేవక సం
   తతివాఁడు సమర్ధుఁ డగుటఁదగునని ఘోరీ
   పతి భారతసామ్రాజ్యం
   బతని వసము చేసి పోయె నాత్మనగరికిన్.66