పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర ధ మా శ్వా స ము

17



సీ॥ కమనీయ భారతఖండ సామాజ్య సౌ
            భాగ్యలక్ష్మి విధానఁబరగు మంగ
    ళోదారమూర్తి సంయుక్త సాగిలపడి
            యుండ భూదేవ మంతోక్తి పూత
    కంధిజలాభిషేక పవిత్ర మామె మూ
            ర్ధము నట్టె వామపాదమునఁ దన్ని
   "కదలి పో నాసముఖమున నుండకు' మంచుఁ
            ద్రోసిన లేచి యాదొడ్డతల్లి
            
గీ॥ "తెలిసినది విన్నవించితిదీన నీదు
    హృదయము కఱంగకున్న నేనేమి సేతు'
    నని కదలి వచ్చె సుభయ సైన్యములకును ర
    ణంబు ఘోరంబుగా మూఁడునాళ్లు జరిగె. 59
    
గీ॥ సమరసింహుండు పడియె వైన్యములు చెడియె
   రాజపరమేశ్వరుండు వీరప్రభుండు
   పృథ్విరాజేంద్రుఁడును ఢీల్లిరిపుల బారిఁ
   బడిరి భారతదేశ దౌర్భాగ్యకలన. 60
   
సీ॥ 'నుత రమాఖండ భారతఖండ గగనాగ్ర
              రంగ మధ్యాహ్న మార్తాండమూర్తి
    బప్పరాయాన్వ యాభరణ షట్త్రింశన్నృ
              పాలక కుల భూరివజ్రమకుట:
    యరిగితే ననుఁబాసి చెఱవడె నాపృధ్వి
             మఱఁద లెందరిగెనో యెఱుఁగరాదు
    పదమూఁడు వేల్మంది భటులతోఁ గల్యాణ
             సింగు నాపుత్రుఁడూర్ణిత పరాక్ర
             
గీ॥ ముఁడు స్వయంవరమునకట్లు నడిచె వికి
    నిచటఁ బనియేమి మీరందఱేగు పిదప
    నని పృథాదేవి వగచి నిన్ననుగమింప
    సమసితే శత్రుగజసింహ! సమరసింహ'.61