పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర


గీ॥ యెందఱనో యాశ్రయించి యెన్నెన్నొ గతులఁ
   గుట్రలు కుతంత్రములు చేసి కోర్కెలెల్లఁ
   జెఱుచు జయచంద్రుఁ దుఱక కృశించుచుండె
   నీర్ష్య; తనుచేర్చువాని దహింప కున్నె.56
   
సీ॥ ఇంకొక్కమాఱు దండెత్తిరమ్మని యతం
            డర్ధించె ఘోరీమహమ్మదు విభు
    నావార్త విని యసంఖ్య చమూతతులు కొల్వ
           నరుదెంచె సమరసింహ ప్రభుండు
    మూఁడుకోసుల దూరమునకేగి పృథ్వీంద్రుఁ
           డడుగులకును మొక్కి యతనిఁ దెచ్చె
    'గగ్గా'ర్నదీ తటక్ష్మాసీమ యవన సై
    న్యం బుండె డిల్లి సైన్యములు వచ్చె
    
గీ॥ నాప్తులును దాను జయచంద్రుఁ డాయవనులఁ
    గదిసె నుదయ మయ్యదిచూచి కదలి వెళ్లి
    తండ్రి మృదుపాదములకు వందన మొనర్చి
    యుదిలకొని మహారాజ్ఞి సంయుక్త యపుడు. 57
    
సీ॥ 'భరత మహామహీస్వాతంత్య్ర ముడుప శ
            త్రులు వచ్చి రదినిల్పఁ దొడరవచ్చె
     నాప్రాణవిభుఁ డఖండ ప్రాంభవుండు నే
            నుండ వేర్వేఱ మీకుండఁదగునె
     ధర్మపక్షము మాది దయచేయవయ్య పృ
            థ్వీవిభు నర్ధాంగిఁ బిలుచుచుంటిఁ
     జెడుగులే దీవు వచ్చిన సత్కరించు నా
            భర్త నిన్ వైరము వదల దేని
            
గీ॥ నేగుము కనూజి కటులు పోవేని భార
     తావనిని దాస్యమునఁ దోయు నపయశంబు
     ననుభవింతు వా చంద్రతారార్క' మనుచు
     మ్రొక్క-జయచంద్రుఁడును గడుఁ ద్దుఁ డగుచు. 58