పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర ధ మా శ్వా స ము

15


గీ॥ గడియ ప్రొద్దుండు వేళకే కాన్యకుబ్జ
    దళము ఢిల్లీ సైన్యము డానెదానిఁ దాఁక
    వేగురు భటుల నిలిపి పృధ్వీ విభుండు
    ముందు నడిచె యుద్ధము ఘోరముగను రేఁగె. 51
    
గీ॥ అహితులను నూర్లు వేలుగా నణఁచి ఢిల్లి
    భటులు కడతేఱి రంద ఱవ్వలి దినంబు
    వెడలి రారోడు లలమిరి పృధ్విసింగు
    భట సహస్రద్వయము నిల్పి వఱచే నవల. 52
    
క॥ అరివీరభటు ల నేకులఁ
    బొరిగొని వారెల్లఁ దెగిరి మూఁడవనాఁడా
    యిరువాఁగులు మఱలన్ డా
    సిరి కాళిందీతటంబు చేరువ సీమన్ 53
    
మ॥ అరుగుదెంచెను యోగినీపురవరంబందుండి పృథ్వీంద్రు సో
    దరుడున్ వీరుఁడు చంద్రరావు చముపుల్ తన్గొల్వ, రారోడ్భటో
    త్కరమున్ దాఁకె నతండు యుద్ధము మహోగ్రంబై విజృంభించె దొం
    తరగా మ్రగ్గెను రెండుపక్షముల యోధశ్రేణి నిశ్శేషమై. 54
    
ఉ॥ ఐదవనాడు వృథ్వి వసుధాధిపుఁ డాత్మపురంబుఁజేరి ని
    త్యోదయ భాగ్యశోభన ముహూర్తమునందున విశ్వవైభవ
    శ్రీదయివాఱఁ ద న్నభిలషించిన కన్యను బెండ్లియాడె స
    మ్మోదముతో ధరావలయమున్ బరిపాలనఁజేసె దక్షతన్.55
   
సీ॥ అభిచార హోమంబు లాచరించెడువారి
             బిలిపించి నూర్లును వేలు నొసఁగి,
     హంతకులను గూడి మంతనంబు లొనర్చి
             లక్షలు లక్షలు లంచమిచ్చి
     పరిసర నృపకోటిఁ బురికొల్పి కోటానఁ
             గోట్లిచ్చు పయి కుసిగొలిపి పంపి,
     రాజోత్సవముల మారణ యంత్రములు పన్ని
             పొంచి ప్రేల్పించి చంపించ నెంచి