పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర


సీ॥ కొన్నాళ్లకవ్వలఁ గొండలోయను గద
          యట్టి యాయుధ మూని యాశ్వికుండు
    చేరరాఁగ నజేయసింహుండు నాతని
           కొలువువారును జూడ్కి గొలిపి; రంత
    నాహమీరుఁడు బల్లె మవనిపై నిడి తండ్రి
           శ్రీపాదముల నమస్కృతి యొనర్చి
   "గుఱుతింపు నీమూంజుశిర" మనె ఱేడు పు
           త్రకుని ముద్దాడి యెత్తుకొని సింహ
           
గీ॥ పీఠ మెక్కించి తిలకంబుపెట్టి రాజు
    సలిపి నిజపుత్ర యుగము దేశమ్మునుండి
    తఱుమఁగొట్టె; ద్వితీయ పుత్రకుఁడు మడిసెఁ
    గైలవారా గిరీంద్రి శృంగాటకమున 93
    
గీ॥ చుక్క తెగిపడ్డ కైవడి సుజనసింగు
    వారిలోఁ బెద్దవాఁడు సత్పదము తప్పి
    దక్కనున భారతాంబ పాదములఁ బడియె
    వాఁడెపో శివాజీరాజు వంశకర్త. 94
    
గీ॥ సింగపుం గొదమ విధాన సింహపీఠిఁ
   జేరి కూర్చిండిన హమీర సింహభూమి
   పాలకప్రవరుండు సంవర్త సమయ
    ఘన ఘనాఘనగంభీర నినదమరల. 95
    
సీ॥ "భిల్లులు తఱచుగా వేఁటల కరుదెంతు
            రని సాద్రి విపినమం దణఁగి యుంటిఁ
     బందిఁ తఱుముకొంచుఁ బరివారములు లేక
            మూంజుఁ డొక్కఁడె వనంబునఁ గనఁబడె.
     నడిగె "నీవెవ్వఁడవని సన్ను 'నీవెవ్వఁ'
            డని యంటి 'మూంజుఁడ' ననెడు నంతఁ
     దల నాదు ఖడ్గధారల నూడి యిలరాలెఁ
            గుంతంబు కొనఁ దలఁగ్రుచ్చి యెత్తి