8
రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర
ది నిలింప ప్రకర ప్రపూజ్యమగు జ్యోతిర్లింగ సంఘాతమున్
దునియల్ చేయుచు ద్రవ్యరాసులను దొంతుల్ దొంతులున్ జేకొనెన్ 24
సీ॥ భువన వీరసమూహమున మేటి యితఁడంచు
యశ మొందఁ గనిన మహాభుజుండు
కొండపల్లెను మార్చి గొప్ప సామ్రాజ్య సం
స్థగఁజేయు రాజతంత్రజ్ఞమౌళి
కన్నకొడుకునైనఁ గడికండలుగఁ జీల్చి
ధర్మంబు నిలుపు నుదారబుద్ధి
విశ్వకళాశాల వెలయించి దేశదే
శముల విద్యను బెంచు జ్ఞానమూర్తి
గీ॥ కవుల పాలిఁటి ముంగిటి కల్పకంబు
విగ్రహారాధనము పైన వెగటు వలన
గజిని మహమదు దండెత్తెఁ గాక యున్న
నంతవాఁడెట్లు జనహింస కనుమతించు25
గీ॥ ఇటులు పండ్రెండు మార్లు దండెత్తి వచ్చి
ధన కనక వస్తుతతిఁ గొని చనుటె కాని
భరతఖండంబు శాశ్వత వాసముగను
జేయఁదలపక నిజసీమఁ జేరుకొనియె.26
-: ఘోరీ మహమ్మదు యాత్రలు :-
ఉ॥ ఆకడగండ్లు వాసి, భరతావని కొంతకుఁ గొంత కోల్కొనన్
బోకయమున్నే వేఱొక రిపుండు మహమ్మదు పేరివాఁడు ఘో
రీకులుఁ డాత్మవాహినులు క్రిక్కిరియంగను గోరుచుట్టుపై
రోఁకటిపోటునాఁ బ్రళయ రుద్రుని కైవడి వచ్చె నుధ్ధతిన్.27
శా॥ ఆకాలమ్మున సార్వభౌముఁడయి యార్యావర్తమున్ బృధ్విరా
జేకచ్ఛత్రముగాఁగ నేలె నతఁడయ్యింద్రాత్మజున్ బోలె సు
శ్రీ కల్యాణ పరాక్రమోన్నతుఁడు ఘోరీవంశజున్ దాఁకి చీ
కాకై పాఱఁగజేయ సైన్యముల నాయత్తంబు చేసెన్వడిన్.28