పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రధమాశ్వాసము

7

 

గజినీ మహమ్మదు దండయాత్ర


 
ఆ॥ వె॥ రాదినంబు నుండి యీదినంబునకుఁ జో
    హణ కులంబు వారలాత్మజులకుఁ
    గాలి గజ్జియలను గట్టరు లాటుని
    యెడల వారి భక్తి యెట్టి దొక్కొ
       
సీ॥ భాగ్య సౌభాగ్య సంభావ్యముల్ సింధు ఘూ
           ర్జర దేశములను వర్తకముఁబెంప
   ‘టైగ్రిస్' నదీ కృపీట పవిత్రమైన య
           రాబియా పాలించు రాజలోక
    మణి కనీప్ ఉస్మాను మఱి కలీన్ ఆలి యే
           జీదు ఖొరాసాను క్షితిపమౌళి
    యబ్దుల్ మలీకు సైన్య సముద్రములను బొం
           గించి హైందవమును ముంచి తేల్చి

గీ॥ రటుపయిని హరూన్ ఆల్రాశ్చిదను కలీప్ అ
   రాబియా మొదల్ కాశి పర్యంత మేలె
   నవ్వల సెబాక్టజిన్ వచ్చె నతఁడు ప్రళయ
   భైరవుని మహమ్మదుఁ దెచ్చే వానికొడుకు.21
   
మ॥ తడ వింతేనియు లేక వీరభట సంతానంబు తన్గొల్చి వెం
    బడిరా సింధునదీన్ దరించుచు మహమ్మద్ గజ్ని గజ్నీ విభుం
    డడవుల్ గాల్చుచు భస్మమున్ సలుపుదావాగ్నిన్ బలెన్ బొంగుచున్
    దుడిచెన్ భారత దేశ పట్టణము లందున్ గల్గు సర్వస్వమున్ 22
    
మ॥ కడుసౌభాగ్యము గల్గు రాష్ట్రముల వంకన్ సుంత కన్నెత్తి చూ
    డఁడు బంగారము పండు నేలలను జూడండట్టె పేర్వాసిఁగాం
    చెడు దేవాలయ లింగముల్ పెఱికి గజ్నీ సౌధ సందోహ మె
    క్కెడు సోపాన చయంబుఁ జేసె విహితుల్ కీర్తింప వేభంగులన్. 23
    
మ॥ అనయోత్సాహముతో మహమ్మదు చలంబారంగ సౌరాష్ట్రమం
    దున విచ్చేయుచు సోమనాధపుర మందున్ సోమనాధేశ్వరా