పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర


మ॥ ఒకబాగ్దాదు నరేంద్రచంద్రుఁడు కవీప్ 'ఓమా’రబుల్ హాసు సే
    న కధీశున్ బొనరించి హైందవముపైనన్ బంపఁగా దూరమెం
    చకయే యామడ యడ్గుగా నడిచి రాజస్థానమున్ జేరి భూ
    ప కులారణ్యములన్ దహించె నతఁడున్ వైశ్వానరప్రాయుఁడై. 17
    
మ॥ ప్రళయాంభోధరపంక్తి చందమున గర్జల్ సేసి తచ్ఛైన్యముల్
    దళమై యా యజమీరుపై నడిచె దూలారావు తౌరుష్క యో
    ధులు మూన్నాళ్లు బడల్ పడన్ మెలఁగి శ్రాంతుండై యబుల్హాసు ను
    జ్వల హేతి ప్రహతిన్ దెగెన్ రిపుజనోత్సాహంబు రెట్టింపఁగన్ 1818
    
సీ॥ తత్పరిసర సైకతస్థలిపైఁదోడి
            బాలురతో నంతవఱకు నాడు
    కొనెడు దూలారావు కొమరుఁ డేడేండ్ల లా
            టుఁడు తండ్రియు శిరంబు డుల్లి ధాత్రి లఁ
    బడుటఁ గన్గొని రక్త ముడుకెత్తి చేరువ
            భటుచేతఁగల పెద్ద బారుటీటె
    గుంజుకొం చరిగె చెంగున దాట్లిడుచు నబుల్
            హాసు గుండియ లవియంగఁదాఁకె
            
గీ॥ నిరువురును బోరి రొండొరు నిచ్చమెచ్చ
   కంత లాటుఁ డరిన్ గూల్చి యతనివెంట
   నరిగె దివికి హితాహితులంద "ఱీతఁ
   డౌర యభిమన్యు పైచేయి" యని నుతింప.19
   
సీ॥ లాటుఁడుత్తమ గుణాలయుఁ డమానుష వీర
            పురుషమూర్తి యని యందఱకుఁదోఁచేఁ
    జోహణు లాబాల శూరుని విగ్రహం
            బులు రచింపించి దేవుని విధానంఁ
    బ్రతివత్సరము భక్తివఱల జ్యేష్ఠద్వాద
            శీ దినమందుఁ బూజించు చుందు
     రాలాటుఁ డనిచేయు నపుడున్న కాలి గ
            జ్జెల నెల్ల జనులు దర్శించి పోదు;