పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11


గీ॥ దేశభక్తియుతంబు నీతిప్రబోధ
   కముఘనాదర్శమగు పద్యకావ్యమొకఁడు
   సరసజనములుమెచ్చ రసంబు హెచ్చ
   సృష్టి సేయంగ నిపుడు యోజించుచుంటి.
  
క॥ విరచించునెడలఁ గల్పన
   పేరయకయును నతిశయోక్తి పెంపొందకయున్
   జరిగినది జరిగినట్టులు
   మెఱయుటచే దేశచరిత మెప్పు వహించున్.41
   
క॥ ఆదిగా కార్యావర్తము
   త్రిదశులకును బావనమగు దేశము; దానన్
   బొదలెడు నృపులు మహేంద్రుని
   మదిమెచ్చరు పుణ్యవిభవమాన్యతలందున్.
   
సీ॥ మేవాడ రాజ్యలక్ష్మీ పదాంభోజాత
             ములను గొల్చిన దత్త పుత్రకుండు
    బాలగోవింద విప్రస్వామి శిష్యుఁడై
             తవిలి మ్రొక్కిన మేటి ధర్మమూర్తి
    స్వర్ణరక్షాబంధ బద్ధుఁడై బూందీ మ
             హారాజ్ఞి సేవించుననుఁగుదమ్ముఁ
    డఖల ప్రజాగణంబభినుతుల్ గావించు
             రామసింహుని రాజరక్షకుండు
             
గీ॥ తీవ్రరుజ పెచ్చు పెరిగి బాధించుచున్నఁ
   ద్రుటియు మేవాడ విడఁబోని దొడ్డమగఁడు
   భరత ఖండాభిమాని సత్ప్రభువతంస
   మాప్తమణి టాడ్డుదొర నిత్యమభినుతింతు.
   
మ॥ సరసాగ్రేసర చక్రవర్తియును నా 'స్కాట్లండు' సంవాసియున్
    వరకారుణ్య రసార్ద్ర మానసుఁడు కర్నల్ జేమ్సు టాడ్పండితుం
    డిరవై రెండగునేండ్లు హైందవమునం దీంపార నుద్యోగియై
    చరియించెన్ గిరులున్ బురంబులును రాజస్థానదేశమ్మునన్.