పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10


గీ॥ వాలి వాల్మీకి కేమికావలయు ననుచు
    గైక కైకసి చెల్లెలుగాదె యనుచుఁ
    గర్ణుఁ డాకుంభకర్ణుని కడపటి కొడు
    కగుఁగదా యని యడుగు విద్యార్థులుండ్రు.
   
ఉ॥ క్రూరమృగంబు, వాడియగు కోఱలు, పెద్దదీ తోఁక, యాఫ్రికా
    తీరవనంబులన్ దిరుగు, దీనిని మర్త్యులు పట్టలేరటం
    చాఱవ ఫారమున్ జదువు నర్భకుఁ డొక్కరుఁ డావిభీషణున్
    గూరిచి వ్రాసె; నెట్టులు కనుంగొననేర్చెద విట్టిరోఁతలన్.
    
క॥ ఇది యెంతగఁజెప్పిన ను
    న్నది; ప్రకృతము ననుసరింత; మస్మన్మనమం
    దుదయించినట్టి కోరిక
    నిదె తెలిపెద నాలకింపు మీ శ్రద్ధమెయిన్.
    
గీ॥ సప్తసంతానములఁ బ్రశస్తమయి ఖిలము
    గాని దొకకృతి యన్న సత్కవులమాట
    కలికి పదియాఱువన్నె బంగారుమూట
    రమ్యతరమైన రతనాల రాచబాట.
    
సీ॥ జ్ఞానంబునకు మూలసారమౌ నాత్మ కా
            వ్యకవిత్వమని "వర్డ్సువర్తు” నుడివె;
    సత్యంబునకు సౌఖ్య సంగంబు చేకూర్పఁ
            జాలిన కళయంచు "జాన్స" ననియె:
    నతుల సంగీతర సాత్మకంబయిన భా
            వాలాపమనుచుఁ "గార్లైలు” తెలిపె
    బ్రతిధావిలానంబు వాక్యదేహంబుఁ దా
            ల్చిన రూపమనుచు 'షెల్లీ' వచించె
            
గీ॥ 'హడ్స'నాదిగ నెందఱో యాంగ్లకవులు
    పద్యకవితకుఁ గల గౌరవప్రశస్తి
    యట్టిదిట్టి దనంగ రాదని సహస్ర
    ముఖముల నుతింప వినమొకో పూర్వమందు.