11
సింహుడు - జగమల్లుఁడు మఱియొకఁడు. ఇతడు శౌర్యహీనుఁడు. ఇతనికి రాజ్య మీయవలయునని రాజు తన సరదారులతో చెప్పిపోయెను.
మ॥ “కమలాప్తాన్వయమా! భవత్కృత మహాఘంబేమొ రాముండుపూ
ర్వము కొన్నేడులు మానియుండవలసెన్ బట్టాభిషేకంబు, చం
డమహీనాధుఁడు లేకయే చనియె నీ నాఁడీ ప్రతాపుండు స
ర్వము గోల్పోయెను దుర్బలుల్ జనకు లౌరా యెంతకున్ గర్తలో'
అని బంధుజనులు విషాద మొందిరి సలుంబ్రాకృష్ణుఁడు అచ్చటి తీర్పరి. రాజుతో 'సరే' యనెను కాని చివరకు ప్రతాపునే రాణాచేసెను. జగమల్లుఁ డభ్యంతర పెట్టెను. ఈ కవి చాలచోట్ల నన్నయగారిని పోలినట్లు వ్రాయును. రాజసూయమున సహదేవుఁడన్న మాటలకు, ఇచ్చటి సలుంబ్రాకృష్ణుని మాటలకు పోలిక చూడుఁడు.
"రాణాలన్ బొనరించు బాధ్యత సలుంబ్రా వారిదన్ మాట యీ
క్షోణిన్ గల్గిన వారెఱుంగుదురు, ఇచ్చోనేఁ బ్రతాపున్ మహా
రాణాగా నొనరింతుఁ గూడదను ధీరగ్రామణుల్ గల్గినన్
బాణిన్ బైకెగనెత్తుఁ డిప్పుడె యెదుర్పన్ వత్తు నత్యుద్ధతిన్.”
జగమల్లుని త్రోసిరాజని కృష్ణుఁడు ప్రతాపునే సింహాసన మెక్కించెను.
“పరిఫుల్ల రుచిర సరసిజ పరంపరలు నెరిపి నటు నదాభవనం బ
ప్పుర జనములనెమ్మోములఁబరమామోదమున నపుడు భాసిలుచుండెన్
ఇది మఱల నన్నయ్యగారి రచన. ఈ పట్టాభిషేకోత్సవ మంతయు ప్రబంధ సరణి నడచెను.
రెండవ కొడుకైన సూక్తుఁడు సలుంబ్రాకృష్ణునివద్ద పెంపఁబడెను. ప్రతాపుఁ డతనిని దనవద్దకు పంపుమనెను. శ్రీకృష్ణుఁడుపంపెను. “నాస్వామి స్నేహముమ్రోలఁ దుచ్ఛములు సప్తద్వీప సామ్రాజ్యముల్"
వసంత కాలము వచ్చెను ఎల్లరాజులు ప్రతాపునకు కానుకలు పంపిరి. మఱల నన్నయ్యగారివలె వ్రాయుచున్నాఁడు.
మ॥ "తలపైనన్ మగఱాతురాయి వెలుగొందన్ ధాళధళ్యంబు రం
జిలు ఖడ్గంబులు వ్రేల, దొడ్డనునుతేజీ లెక్కి యోధాళి చెం