పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ య స్కం ధ ము.

125


    లేమా బొక్కస ముత్తదైన బవరా ల్సేయంగలేమా చనన్
    లేమా దేశము లెన్ని సంచులు వడిన్ లెక్కింపు డెక్కింపుడీ.216
 
సీ. పాంచాలి సిగఁబట్టి పడలాగినందుకా గ్రుడ్డివానికి సొమ్ము కొల్లయిడుట
    అఖిలంబు గొని యరణ్యము నంపినందుకా గ్రుడ్డివానికి సొమ్ము కొల్లయిడుట
    పొరి భాగ మడిగిన బొమ్మనినందుకా గ్రుడ్డివానికి సొమ్ము కొల్లయిడుట
    పడరానిపాట్లన్నీ పడవేసినందుకా గ్రుడ్డివానికి సొమ్ము కొల్లయిడుట

తే.గీ. నీవు కంకుడవై నందుకా వలలుడ | నేనయినయందుకా కఱ్ఱి నెఱిబృహన్న
    లయును నైనందుకా కవల్ హయసురథుల గాచినందునకా సొమ్ము దోచునితడు.217
 
క. అని ధనము నీను పో పొ | మ్మని భీముడు ననిన మువ్వురనుజుల యొడబా
    టెనసి యుధిష్ఠురుఁ డిచ్చెను ధనమును ధృతరాష్ట్రునకును ధర్మజ్ఞుండై. 218
  
క. అదిగొని ధృతరాష్ట్రుఁడు తన | మదవతియు దాను నుచిత మార్గంబున నొ
   ప్పిద మొదవ నౌర్ధ్వదైహిక | సదమల కర్మములు పుత్ర సమితికి జేసెన్.219
 
తే.గీ. విపినమున కేగ సమకట్టు విదురుఁ డొకడు | కుంతియొక్కతె దమవెంటఁ గూడివత్తు
   మనిస వారలతోఁగూడి యతిరయమున బోయిరడవికి వైరాగ్యపూర్ణులగుచు.220
 
క. వలదని కొడుకులు సెప్పిన పలుకులు విన కేగెఁ గుంతి వారలతోడన్
   వెలువడిరి ధర్మతనయా | దులు పౌరులఁగూడి కొంత దూరము దనుకన్. 221
 
తే.గీ. సురనదీతీరవసుమతివరకు బంచి | మరలివచ్చిరి హస్తినాపురికిఁ బ్రీతి
   నంత విదురాదులు శతయూపాశ్రమంబు వట్టి తృణములతో నిండ్లు గట్టుకొనిరి. 222
 
క. వినుఁ డాఱు వత్సరంబులు చనె నిట్టుల నొక్కనాఁడు సామజపురిలో
   ఘనుఁడు యుధిష్ఠిరుఁ డొక కలఁ గనియెఁ దుర్బలను కుంతిఁ గాంచిన......... 223
 
వ. అట్లు కలగని లేచి యుధిష్ఠిరుండు తన స్వప్నంబు భంగి దమ్ములకుం దెలిపి కుంతీ
    విదుర ధృతరాష్ట్రులంజూడఁ గోరిక వొడముచున్నదనిచెప్పి మీకిష్టంబయేని యట్ల
    చేయుదముని తమ్ముల నొప్పించి భీమార్జుననకులసహదేవులును సుభద్రా ద్రౌపద్యు
    త్తరలును బౌరజనంబులును వెంటరా బయనంబై శతయూపాశ్రమంబుఁ బ్రవేశించి
    యచట నందఱిం దర్శించి విదురుం గానక ధర్మజుం డాంబికేయున కిట్లనియె 224

తే.గీ. అంబికాపుత్ర యనఘుఁడై నట్టి విదురు | డెంతసూచినఁ గానరా డేడనున్న
    వాఁడనిన నాతఁ డిట్లని పలికి ధర్మ తనయ యతఁడు విరక్తుఁడై యునికి జేసి.225