పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

శ్రీ దేవీ భాగవతము


ఉ. గుడ్డివికావె పిండముసకుం బడియుంటివి యింట నీవు ము
    న్నడ్డితివేమొ నీకొడుకులందఱు దుర్మితు లెన్నిపాట్లు మా
    కొడ్డిరి మేలు మేలనుచు సూరకయుంటివి చాలు గొంగడీ
    గుడ్డయుఁ గఱ్ఱయుం దమిదకూ డిపు డో ధృతరాష్ట్ర నీకునున్. 208

ఉ. తోచెనె మేలు ధర్మజుని దొడ్డతనంబు గ్రహింపలేక యా
    నీచులు నీకుమారులు వని న్మము ద్రోచిననాడు, నేడు నీ
    వాచవి దీర్ప రాజనపువడ్లను దంపిన బియ్యమేసుమా
    చూచితివొక్కొ ధర్మజుని శుద్ధఘతిన్ ధృతరాష్ట్ర చెప్పుమా.209

చ. అలిగిననేమి యెత్తిపొడుపంచు దలంచిన నేమి దెప్పులన్
   వలచితి నీవు ము న్నిటుల వచ్చునొకో యని యెంచకుంటివే
   తలఁగక దుస్ససేనుఁ డటు ద్రౌపది కొప్పునుఁబట్టి లాగిన
   ..లఘుఁడు ధర్మజుండె గతి యాయెనుగా ధృతరాష్ట్ర నేటికిన్.210

ఉ. కాకికి వేయలేదె కణ కాండము కుక్కకుఁ బోయలేదె గం
    జీకుడు పొక్క గౌరవమె యెక్కడికేగితివయ్య లక్కయి
    ల్లో కురువంశవర్ధన మహోగ్రహుతాశనుపాలుచేసిన
    ట్లీకడఁ బొట్టనిండ భుజియించెదె పప్పును గూడు నేయియున్.211

వ. ఇవ్విధంబున భీముండు నిష్ఠురంబులాడుచుండ వినుచు ధృతరాష్ట్రుండు పదునెనిమిది
    వత్సరంబులుండి యొక్కనాడు ధర్మజుంగాంచి యిట్లనియె.212

ఉ. అన్న సమస్త మీవెఱుఁగు దందఱు వోయిరి మీరె దిక్కు నే
    నున్న విధంబు సూచితి వయో వనిభూములకేగి మౌనివృ
    త్తి న్నిరపాయమార్గము మతిం దలపోయఁ దలంపు పుట్టె నన్
    మన్నన చేసి పంపుము శ్రమింబని యెంచక ధర్మపుత్రకా.213

తే.గీ. అందరికి వాయుజుఁడొసంగె నౌర్ధ్వదైహి| కములు నాబిడ్డలకునివ్వఁ డమితమైన
    క్రోధమునఁజేసి కావునఁ గొడుకులకును। నౌర్ధ్వదైహికము లొనర్తు నచ్చోటువోయి.214

క. మనమున నలుగక చాలిన ధన మిప్పింపుమని యడుగ ధర్మజుఁడు మనం
   బున నొడఁబడి తనవారల సనుమతికై యడుగ భీముఁ డతి కుపితుండై.215

శా. ఏమీ యీయఁగవచ్చు బొక్కసమునం దెంతేని మూలున్ ధనం
    బామిత్రుండు సుయోధనుండు మన కత్యంతంబు మేల్సేసెఁ దే