ద్వి తీ య స్కం ధ ము.
123
వ. ఇట్లు విగతాసుండైన పాండుభూపతిం గాంచి కుంతియు మాద్రియు శోకాకులలయి
యుండం గాంచి యచ్చటి ఋషులు వారి నూరడించి యుత్తరక్రియలు యథావిధి
జరిపి మాద్రి యనుగమనం బపేక్షించ నట్ల కానిమ్మని యామె బిడ్డలం బోషింప
గుంతికి నియోగించి హస్తిపురంబునకుం బంచిన వచ్చి పురంబున ప్రవేశించినం గని.196
క. త్రిదశనదీతనయుండును | విదురుఁడు ధృతరాష్ట్రుఁ డఖిల విద్వజ్జనులుం
గదియం జని యా కుంతిని మృదువుగ నడిగిన కుమారు లెవ్వ రటంచున్. 197
వ. అది విని.198
క. సురల ప్రసాదంబున బు |ట్టిరి కురుకుల ముద్ధరించుటే పనిగా నీ
చిఱుత లల సురలమంత్రము వరశక్తిం బిలువ వారు వచ్చి ముదమునన్.199
తే.గీ. వీరు మాబిడ్డ లిది సత్య మీరు నమ్ముడనుచు వచియించి సురాపగాసు
తుండు మున్నగువారు సంతోషమంది | రాజగృహముల డించి రవ్యాజలీల.200
వ. అని చెప్పి సూతుండు మరియు.201
-: యు ధి ష్ఠి రా ది చ రి త ము :-
క. ఆ పాండవులైదుగురికి ద్రౌపది సతియై పతివ్రతామహిమంబున్
జూపెన్ నరునకు దా దశరూపధీరానుం సుభద్ర ప్రోయాలయ్యెన్ 202
తే.గీ. ఆ సుభద్రకు నభిమన్యు డాయెఁ గొడుకు ద్రౌపదేయులు వాడును దరలి ...
నతని భామిని యుత్తర యాపె గర్భవతియగుచునుండె యభిమన్యు మృతికి మున్ను.203
మ. శ్రమమింతేనియులేక క్రోధమున నశ్వత్థాముఁ డత్యుగ్ర బా
ణము నేయన్ శిశు వేడ్చు గర్భమున నన్నారీవతంసంబు దుః
ఖముతోఁ గృష్ణుని వేడినం గరుణమై గాచం బరికీణభా
వము నొందం గులముద్ధరించుటను నే ర్వప్పె న్పరీక్షిత్తునాన్. 204
తే.గీ. సొరిది దుర్యోధనాదులౌ సుతులు వారి సుతులునందఱు బోవంగ శోకవార్ధి .
బడిన ధృతరాష్ట్రు గాంధారి పరిచరణము | చేసి కాపాడె రే బగల్ సేతులార.205
క. ధర్మజ్ఞుడైన విదురుఁడు నిర్మలమతి నతనియొద్దనే యుండి సదా
శర్మదమగు ప్రజ్ఞానము. | నర్మిలి బోధించె ధర్మజానుమతిఁ గడున్.206
తే.గీ. ధర్మజుండును ధృతరాష్ట్రు కర్మగతికి 1 గడువగచి వాని పరిచర్య నుడుగకుండె
పొరలికొనువచ్చు దుఃఖాంబుపూరములను | దుడిచె నబ్బబ్బ యతఁ డెంతదొడ్డవాడు.207