పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మ స్కం ధ ము.

103

వ. అనిన విని భీష్ముం డిట్లనియె.757

క. ఇతరునిపైఁ జిత్తంబిడి | బ్రతిమాలిన యాఁడుదాని పాణిం బట్టన్
   మతిమంతు లిచ్చయింపరు | సత మిది నీ తండ్రికడకు జనుమీ వేగన్.758

క. నావుఁడు భీష్ముని పలుకులు | దా విని వనమునకుఁ జేరి తప మొనరించెన్
   బావనతీర్థమునన్ విజ | నావని నొకచోట నాకు లశనముగాఁగన్.759

వ. అది యట్లుండ మిగిలిన యంబాలికయు నంబికయును నను నిరువురు కన్యలును విచిత్రవీర్యునిభార్యలై పరమపతివ్రతామహిమంబు తమదకా రూపలావణ్యవిభ్రమంబుల నసదృశలై భర్తకుఁ
బరిచరించుచుండఁ గొన్ని వర్షంబులకు రాజయక్ష్మామయపీడితుండై భూపతి పంచత్వంబు నొందె
నంతట అత్యంతదుఃఖితయై సత్యవతి ప్రేతకృత్యంబులు నిర్వర్తింపంజేసి వెండియు నేకాంతమున గాంగేయుంబిల్చి యిట్లనియె.760

ఆ.వె. ఓయి భీష్మ మ్రోయు ముర్వీభారము నీవు | నట్ల యనుజభార్య లందుఁబ్రేమ
   సుతులఁ బడసి వంశ మతిశయిల్లఁగజేసి | ఘనయయాతికులము గావుమనిన.761

క. తల్లీ నీవెఱుఁగుద కా | తెల్లముగా మున్నె నా ప్రతిజ్ఞను రాజ్యం
   బొల్లను సతి నొల్లననుచు | జెల్లింపకయున్న నది నిషిద్ధముకాదే.762

క. అనిన విని సత్యవతి దా | మనమునఁ జింతించె నయయొ మహనీయకులం
   బున కిద తుదకాబోలున్ | మునుకొని యిందున కుపాయమును గన మనుచున్.763

క. అది జూచి భీష్ముఁ డెంతయు | మదిలో దలపోసి తల్లి మానుము దుఃఖం
   బొదవింపుము క్షేత్రజసుతు | విదితుని స్మృతిచే విచిత్రవీర్యుని కనినన్.764

క. కులవంతుండగు ద్విజునిం | బిలిపించి విచిత్రవీర్యు పెండ్లామునకున్
   గలిగింపుము సాంగత్యము | కలుగు సుతుఁడు శాస్త్ర మొప్పుఁ గాచుగులంబున్.765

తే.గీ. ఇట్లు పౌత్త్రుండు పుట్టిన యేని వాని | కిచ్చి వేయుము రాజ్యంబు నేను వాని
   శాసనంబునఁ బాలింతు సకలభూమి | సౌఖ్య మింపొందు నీకు నిశ్చయమటన్న.766

క. తన కానీనతనూజున్ | ఘను వ్యాసుఁ దలంచె వేడ్క గామిని యంతన్
   జనుదెంచి యతఁడు మ్రొక్కుచుఁ | గనులయెదుట నిలువఁబడినఁ గనుఁగొని ప్రేమన్.767

ఉ. ఓయి కుమార శంతనుని యుత్తమవంశము నిల్పఁ గోరి ని
    న్నీయదనం దలంచితిని నీవును వేడ్క విచిత్రవీర్యు ప
    ద్మాయతనేత్రఁగూడి యొక యాత్మజు నొందుము క్షేత్రజుండుగా
    నాయెద సంతసిల్లు ననినన్ విని సమ్మతమంచుఁ బల్కుచున్.768

వ. వ్యాసుండు ఋతుకాలంబునకు నిరీక్షించి యథాశాస్త్రంబుగా నంబాలికం గూడిన నామె