పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

102

శ్రీ దేవీ భాగవతము

ఉ. చెప్పెద నొక్కమాట వలఁ జిక్కినదాన ని కెందుఁబోవుదున్
    ముప్పిరిగొన్న ప్రేమమున మున్నె వరించితి మాససంబునన్
    దప్పక సాళ్వభూవిభుని దైవము నీచెయిఁ జిక్కఁజేసె నే
    నిప్పుడు చేయగాఁదగిన దెద్దియొ చెప్పుము బ్రహ్మవిద్వరా. 746

వ. అని పల్కిన యక్కన్యారత్నంబు వచనంబులు విని గాంగేయుఁడు వృద్ధబ్రాహ్మణుల
   యానతిం బడసి తల్లికిం జెప్పి మంత్రులతో నాలోచించి ధర్మంబు విచారించి, యో
   కన్యకామణీ! నీవు నీయిష్టునియం దిదివరక మనంబు నిల్పియుంటివి నిన్ను మేము
   పరిగ్రహించుట ధర్మంబుగాదు కావున నీ యిష్టంబు వచ్చినయట్ల చనుమనిన నది యట్ల
   చేసి సాళ్వుం జేరి యిట్లనియె.747

చ. సరసవరేణ్య పుణ్యమతి సాళ్వనృపాలక నిన్ను నే స్వయం
    వరమున నుల్లమందిడితి వాంఛ మెలర్పఁగ నంచుఁ దెల్పినన్
    బరమనయజ్ఞుడై పలికెఁ బావనచర్యుఁడు భీష్ముఁ డోధరా
    వరసుత పొమ్ము నీమనసు వచ్చినచోటికి నంచుఁ బల్కినన్.748
 
వ. ఇటకు వచ్చితి మఱియు.749

ఆ.వె. నెమ్మనమ్మునందు నిన్ను నే వలచితి | తగిన ధర్మపత్ని నగుదు నీకు
    నన్ను నీవు నట్ల కన్నువైచి వరించి | యున్నవాఁడవైతి విన్నియేల.750

వ. అనిన విని సాళ్వుండు.751

మ. నీను నేనెట్లు గ్రహింతు నిత్తఱి నయో నిన్నప్డు భీష్ముండు గై
    కొనియెన్ నేనును జూచితిన్ రథముపైఁ గూర్చుండఁగాఁజేసె నో
    వనితా యెంగిలిదాన నీ విపుడు కావా పోవె నీవెఱ్ఱి నే
    నినుఁ బెండ్లాడఁ దలంపు లేదు మదిలో నీ కేటికిం జింతిలన్.752

వ. అనవుఁడు.753

తే.గీ. అయ్యయో యెంత విలపింపనయ్యె నాకు | నేమి సేయుదు ననుచు నయ్యింతి మఱల
    భీష్ముకడఁ జేరి యో ధర్మవిద్వరేణ్య | వినుము నా యంగలారుపు విన్నవింతు.754

చ. సుజనవరేణ్య యేను జని చూచితి సాళ్వునిఁ గాముబారిచే
    గిజగిజలైతి వేఁడికొని కేలు మొగిడ్చిత గుస్తరించతిన్
    నిజమును జెప్పితిన్ వినక నిన్నితరుండు గ్రహించెఁ బొమ్ము భూ
    ప్రజలు హసింతు రట్టి నినుఁ బత్నిఁగఁగొన్న ననుండుఁ గ్రమ్మఱన్.755

క. వచ్చితి నీవే గతి యని | యచ్చుగ నన్నిపుడ పెండ్లియాడుము కలదే
    మచ్చిక యటు గాకున్నను | జచ్చెద నీయెదుట నిపుడు సాధుచరిత్రా.756