పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మ స్కం ధ ము.

101

శా. ఆ చిత్రాంగదుఁ డాత్తవీర్యమదుఁడై యత్యంతమై యొప్పు బా
    హాచాతుర్యము సూపె నాదట నొక ప్డారాజు సైన్యోద్దత
    ప్రాచుర్యంబున వేటకేగి యచటం బల్బంగులన్ శాతనా
    రాచక్రీడల వ్యాఘ్ర భల్లుక కిటి గ్రామంబులన్ గూల్పఁగన్.737

సీ. అదియు జిత్రాంగదుం డనియెడి గంధర్వుఁ | డొక్కడు సూచి తాఁ గ్రక్కున నృపు
    నెదిరించి పోరాడె నెలమిని మూఁడువ | త్సరము లాబవరాన జచ్చెరాజు
    భీష్ముఁ డావార్తను విని వాని యౌర్ధ్వదై | హికములు కావించి ప్రకటనీతి
    దొల్లింటివలెనుండి దొరతనం బొనరింప | నుర్వి విచిత్రవీర్యునకు నిచ్చె
    నదివిని సంతోషమందె సత్యవతీ స | తీమణి తన సుతుండె మహీశుఁ

తే.గీ. డాయెనంచును వ్యాసుండు హర్షమందె | భ్రాత రాజాయెనంచు నభ్రాంతవృత్తి
    జెలగి భీష్ముండు దలచె విచిత్రవీర్యు | నకు వివాహంబుసేయుట న్యాయమనుచు.738

వ. ఆ సమయంబున739

తే.గీ. కలరుమువ్వురు కూతులు కాశినేలు | రాజున కతండుచాటించె రాజముఖులు
    పూని తారు స్వయంపరంబున వరింతు | రంచు రది విని రాజన్యులరిగిరందు.740

క. దేవవ్రతుఁడును గాశికి | దా వేగం జని నృపాలతండంబుల వి
   ద్రాణముసేసి కన్యల | భావజు బాణముల రథముపై నిడికొనియెన్.741

ఉ. ఇంటికిఁదెచ్చి లోన విడియించి సమస్తము గూర్చి యిచ్చియా
    దంట స్వమాతలం గనిన దారిని వారిని గాంచె నౌర యే
    వెంట గనుంగొనగలము వీనిని బోలినవాని నంచు నే
    యింటను విన్న విందుము మహింగల పల్లెలఁ బత్తనంబులన్.742

ఆ.వె. తల్లి సత్యవతికి ధరణీసురలకును | విన్నవించె నతఁడు గన్నియలను
    బిన్నతమ్మునకు విచిత్రవీర్యునకును | గూర్పఁ దలచినాడ గూర్మిననుచు. 743

వ. శుభముహూర్తంబడిగి వివాహయత్నంబు సేయించి కన్నియలం దోడ్కొని వచ్చియున్న
    సమయంబున.744

సీ. తల రాగిడీబిళ్ళ తళుకు క్రేవలఁ గ్రమ్మ వింతగా శిరము నొక్కింతవాంచి
    రవల దుద్దులు మిఠారములు చేక్కులదాట నెడనెడ నొక్కింత మెడగదల్చి
    చిరునవ్వు వెన్నెలల్ సెలవులెక్కుచు గ్రాల ననవంటివాతెర నమలినమలి
    ముద్రికామణిఘృణుల్ మురిసి చిందులుద్రొక్క వెసవ్రేళ్ళఁ బైటకొంగు సవరించి

తే.గీ. దేవనది ముద్దుబిడ్డని క్రేవనించి | సిగ్గునం గన్నులరమోడ్చి చీరెదుడిచి
    యాచి తలయూచి యొక్కొక్క యక్షరముగ | మాటలాడెఁ బ్రథమకన్య తేటమీరి.745