పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

63


భూమిసుతాత్మలోల పరిపూర్ణయశోధనధామ వానర
స్తోమముతోడ వచ్చుమిముఁ జూచికృతార్థుల మైతి మెల్లరున్.

225


సీ.

చిరకాలమున నుండి శ్రీవేంకటాద్రిపై
        దప మొనర్పఁగ నావిధాత వచ్చి
రామసౌమిత్రు లీరమ్యవేంకటశైల
        మునకు వచ్చెదరు సమ్మోద మలర
వారు వచ్చెడుదాఁక వదల కిచ్చట నుండి
        వచ్చినప్పుడు మీరు వారి నిచట
సంతోష మొదవించి సత్యలోకమునకు
        రండు మీరనినకారణముచేత


తే.

నెదురుచూచుచు నుండి మేమిచట మిమ్ముఁ
గాంచితిమి మాతపంబు లిక్కడ ఫలించె
నింతయే చాలు సెలవు నిమ్మిపుడు బ్రహ్మ
లోకమున కేగెదము దుష్టలోకనాశ.

225


మ.

అనినన్ రామనృపాలకుండు పరమాహ్లాదంబుతో వారలం
గని యోతాపసవర్యులార! మిము నీకాంతారమధ్యంబునం
దొనరం గంటమి సంతసం బొదవె మీరుల్లంబుల న్వేడ్కమై
జనుఁడబ్జోద్భవుఁడున్నచోటి కనుచున్ సంప్రీతితోఁ బల్కఁగన్.

226


క.

ఆమౌనులు ముద మొందుచు
రామునిచే సెలవునంది రయమున నపుడే
తామరసోద్భవులోకము
రాముని నెంచుచును జనిరి రహి నంద ఱొగిన్.

227


వ.

అనంతరము రామచంద్రుండు తత్పర్వతోత్తరమార్గంబున
నొకపర్వతారోహణంబు సేయుచుండి తన్మధ్యంబున యక్ష