పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

64

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


శాపమోక్షంబు చేసి వచ్చి కందమూలఫలభరితం బగు నంజ
నాశ్రమమునందు నాకాశగంగసమీపంబునం గపిసమూహ
ముతో నిలిచి తత్తీర్థంబున స్నానసంధ్యాద్యనుష్ఠానంబులు
నిర్వర్తించిరి. అంజనాదేవి పుష్పంబులఁ బూజించి పరమ
రుచ్యఫలంబు లొసంగి ముదమార వేఁడుటం జేసి యారామ
లక్ష్మణులు సంతుష్టు లై యంజనాదేవిని నాదరించి వీడ్కొని
యందుండి సుగ్రీవాంగదకపిముఖపరివృతులై స్వామిపుష్క
రిణికి వచ్చి జయప్రదసంకల్పపూర్వకంబుగ స్నానం బొనర్చి
తత్తీరశృంగారవనంబునం దొక్కింతతడవు సుఖాసీనులై దర్శ
నార్థంబుగ వచ్చినమునుల కనేకఫలదానంబు లిచ్చి పుష్క
రిణికి నిఋతిభాగంబున నొకపర్ణశాలం జేరి యున్నసమ
యంబున నాంజనేయుండు వివిధఫలకందమూలాదులును దేనె
పెఱలును దెచ్చి సమర్పించెఁ బరివారముతోడ రామలక్ష్మణు
లారగించి పరిపూర్ణులై రట్టియెడ.

228


సీ.

ఘనుఁ డాంజనేయుండు కపిసమూహముఁ జూచి
        పిలిచి యిట్లనియె సంప్రీతి మెఱయ
వానరులార యీవనపర్వతములందుఁ
        జూతజంబూఫలవ్రాతములను
బనసపండ్లును ద్రాక్షపండ్లును బదరికా
        ఫలము లనంటులు పాలపండ్లు
పరమముదంబున సరవి మెక్కుఁడు వనం
        బున విహరింపుఁడు మనసులార


తే.

ననిన విని కపిబృందంబు లపుడు చెలఁగి
ఫలమహీరుహములఁ బ్రాకిపండ్లఁ గోసి