పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


యటు గాన మాతల్లియందు సత్కృప నుంచి
        యటకు రావలె నిపు డనఁగ రామ


తే.

చంద్రుఁ డబ్జాప్తసుతుని లక్ష్మణునిఁ గాంచి
మందహసితాస్యుఁడై హసుమంతుఁడనుట
వింటిరే యన్న వారు భూవిభుని జూచి
దేవ మీయిష్ట మని రంతఁ దెఱఁగునెంచి.

219


క.

మనమున దశరథతనయుం
డనుమోదము నొంది వత్తునని చయ్యన న
య్యనిలతనూజుని గని యి
ట్లనియె న్గౌరవ మెసంగ నందఱు వినఁగన్.

220


ఉ.

మారుతపుత్త్ర నీమనవి మామది కిష్ట మొసంగె నిప్పుడా
చారుతరాంజనాఖ్యవరశైలపథంబున వేడ్కఁ బోద మా
దారిని వానరావళికిఁదప్పక చూపు మటంచుఁ బల్క న
వ్వీరుఁడు సంతసించి కపివీరులఁ బిల్చి ప్రియంబు మీఱఁగన్.

221


ఆ.

వేంకటాద్రిమార్గ మంకం బెఱింగించి
హరిసమూహవిభునియనుమతమున
రామలక్ష్మణులను రహి మీఱ భుజములం
దుంచికొని బలంబుఁ బెంచి నడచి.

222


ఆ.

నిక్క వేంకటాద్రి కెక్కుమార్గమునందు
వరమునీంద్రు లెదురు వచ్చి నిలిచి
బహువిధముల రామభద్రుని వినుతించి
యిట్టు లనిరి కీర్తి యినుమడింప.

223


ఉ.

రామనృపాల ఘోరతరరావణశౌర్యవిఫాల భవ్యసు
త్రామ సురార్యయోగిజనతాపసపాల కృపాలవాల శ్రీ