పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

61


సీ.

ఈ వేంకటాద్రిపై నెలమి వర్తించుదుఁ
        గావున నాయందుఁ గరుణనుంచి
వేంకటాద్రికి మీరు విచ్చేయుఁడన విని
        శ్రీరాముఁ డిట్లనె వీరకపులు
తోడ శీఘ్రముగాను దూరప్రయాణంబు
        కలిగియున్నది కార్యఘటనమైన
వెనుక నీయిష్టము వేంకటాద్రికి వత్తు
        మనఁగ దేవరదర్శనార్థ మచటఁ


తే.

గాచి యున్నారు మునివరు ల్గాన వారిఁ
జూడ రావలె ననుచు నాచేడె పిలుచు
సమయమున నాంజనేయుఁ డచ్చటికి వచ్చి
వినయమున మ్రొక్కి యీరీతి విన్నవించె.

216


తే.

దేవ మాతల్లి యంజనాదేవి మనవి
చేసినట్లుగఁ గరుణించి చిత్త మలర
వేంకటాద్రికి నేగుట వేడ్క మాకు
మఱియుఁ గపులెల్ల నలసిరి మార్గమునకు.

217


వ.

ఇదియునుం గాక యాహారంబు గొనవలసియుండుటం జేసి యిప్పుడు.

218


సీ.

శ్రీజయనాశ్రమసిద్ధస్థలమునందు
        ఫలసుమవృక్షము ల్గలిగి యుండుఁ
గందమూలాదులు ఘనపుణ్యతీర్థంబు
        లందుండుఁ గనుక నేఁ డచట నిలిచి.
యావలఁ బోఁ దగు నంజనాద్రికి నొగి
        మనప్రయాణమునకు మార్గ మదియ