పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

57


సీ.

పాండవాత్మజులార ప్రబలురయ్యును మీరు
        కర్మవశంబునఁ గాన నిట్లు
వసియించుకాలంబు వచ్చె గదా యైన
        జయము శీఘ్రమ గల్గు భయము వలదు
శ్రీకరం బైనట్టి శ్రీవేంకటాద్రికి
        భక్తితో నేగి గోప్యముగ నుండు
క్షేత్రపాలకునిచేఁ జెలఁగి పాలిత మయిన
        పరమపావనతీర్థప్రాపుఁ జేరి


ఆ.

స్నానపానజపము లూని సేయుఁడు శత్రు
ప్రకరహాని గల్లి ప్రాభవంబు
తనరునంచుఁ జెప్పఁ దద్దయుఁ బాండవుల్
వేంకటాద్రి కేగి వేడ్క నెగడ.

203


ఆ.

క్షేత్రపాలుఁ డుండు సిద్ధస్థలంబున
నిలిచి స్నానపాననిష్ఠ లచట
సలుపుచుండ నొక్కసంవత్సరము చనె
నంత వేంకటేశుఁ డాదరమున.

204


సీ.

స్వప్నమునం బాండవాగ్రజుం గని యిట్టు
        లనె మహారాజు నీవరుల నెల్ల
సమయించి రాజ్యంబు చక్కఁగ నేలుము
        సందియంపడకు పో సదయ ననఁగ
ధర్మజుం డటు లేచి తగ మ్రొక్కి యావల
        భీమార్జునాదులం బిలిచి స్వప్న
సంగతిఁ దెల్పంగ సంతసం బందిరి
        యంత నందఱతోడ నద్రి డిగ్గి