పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


తే.

శత్రువుల గెల్చి గజపురి శస్తముగను
జేరి రాజ్యంబు నేలుచు భూరికీర్తి
నొందె ద్రౌపది యిష్టంబు నొందెఁ గృష్ణు
నిష్ట మీడేరెఁ ద్రిజగంబులెల్లఁ బొగడ.

205


చ.

గుఱుతుగఁ బాండునందనులు కొన్నిదునంబులు భక్తియుక్తులై
తఱమిడి నందు నిల్పినకతంబునఁ బాండవతీర్థ మంచు ని
త్తరి నరు లెన్ను చుండుదురు దానిమహత్వము క్షేత్రపాలకుం
డెఱుఁగును గాని యెంచ మఱి యెవ్వ రెఱుంగరు ధారుణీస్థలిన్.

206


వ.

మఱియు స్వామి పుష్కరిణి బూర్వభాగంబున జరాహరం
బును, వలిఘ్నంబును రసాయనంబును అనుమూఁడు తీర్థంబు
లును, హరి వసింపఁ దగిన వైకుంఠపర్వతగహ్వరంబును,
అష్టలోహఘాతంబులును గల్గియుండు నింతయు నాపుష్కరి
ణికి ద్వావింశతిశరపాతదూరంబున మాయాతిరోహితశక్తి
యన్నిట నావరించి యుండుం గావునఁ దత్తీర్థాదులు బుధుల
కైన గాంచ నశక్యంబు లగుచుండు నట్టిమహిమ లొప్పు
చున్న వేంకటాచలంబున నంధులు మూకలు బధిరులు
గొడ్రాండ్రు ధనహీనులు శ్రద్ధాభక్తి హరిం గొనియాడుచు
నుండిరేని వారికి నభీష్టాదు లాపూర్తియగు నని యుగ
భేదంబువలన నొక్కవిశేషంబు కల్గుచుండు నయ్యదెఱింగింతు
వినుండని సూతుం డిట్లనియె.

207


వేంకటాద్రి యుగభేదంబులం బ్రకాశించుట

సీ.

ఆ వేంకటాద్రి మహాద్భుతంబుగ నొక్క
        తఱి హరివిధమునం దనరుచుండు