పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/493

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

486

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


మును మధ్యపాపంబు మొనసిన సామాన్య
        పాపంబు నరుల కేఫలము లిచ్చు
మిశ్రకర్మాధిక్య మిధ్యశ్రమము మిశ్ర
        సామాన్య మేగతుల్ జనుల కొసఁగుఁ


తే.

గామ్యకర్మంబులును గతకాలకర్మ
ఫలము లేమార్గములఁ జూపుఁ బ్రజల కనిన
విని మనంబున భావించి మునివరులను
జూచి గురుని దలంచి యాసూతుఁ డనియె.

239


వ.

కర్మలుచేతనే జీవులకు జన్మంబులు గల్గుచుండు కర్మంబు
లెన్నివిధంబు లనినఁ బుణ్యపాపమిశ్రకర్మంబులను మూఁడు
విధంబులు తత్కర్మఫలానుభవంబు లెట్లనినఁ బుణ్యకర్ములు
దేవాదిశరీరంబులందును, పాపకర్ములు తిర్యగాదిశరీరంబుల
యందును, బణ్యపాపమిశ్రకర్ములు మనుష్యాదిశరీరంబులయం
దును బొందుదురు. మఱియుఁ బుణ్యాతిశయులును హిరణ్య
గర్భరూపంబునందును, బుణ్యమధ్యము లింద్రాదిశరీరంబులం
దును, సామాన్యపుణ్యులు యక్షరక్షః ప్రముఖ తామస
దేహంబులం బొందుదురు. మఱియు నుత్కృష్టపాపంబులు
చేసినవారు జనతాపకరంబులైన కంటకవృశ్చికవనమక్షికాది
క్రూరజంతువు లగుదురు. పాపమధ్యములు కదళీ నారికేళాది
వృక్షంబు లగుదురు. సామాన్యపాపులు గోగజాదు లగుదు
రు. సామాన్య మిశ్రకరులు వర్ణాశ్రమ ధర్మార్థకామ్యకర్ము
లై యుదయింతురు. అత్యుత్కర్షపుణ్యపాపమిశ్రకర్ము
లీశ్వరార్పితసత్కర్మ లాచరించి యందువలనఁ జిత్తశుద్ధియు
నందువలన సాధనచతుష్టయసంపత్తి గల్గి యందువలన సద్గురు