పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/492

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

485


మహామంత్రసిద్ధులును సదా నారాయణస్మరణ నేమరక
చేయువారును, వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్నానిరుద్ధ
వ్యూహంబులందుఁ బొందుదురు. విష్ణుం డొక్కఁడ మహ
ద్భూతంబని మఱి యనేకభూతంబులు పృథగ్భూతంబులని
విష్ణుండ సాత్వికబ్రహ్మంబని నిశ్చయించి విష్ణుషడక్షరీమహా
మంత్రసిద్ధులైన విష్ణుపరాయణులు శ్రీవైకుంఠము సేరు
దురు. సద్వ్రతనిష్ఠ జ్ఞానభక్తివైరాగ్యసంపన్నులు కారణ
వైకుంఠంబులందుఁ బొందుదురు. వీరందఱును వటపత్రశయ
నుని నాభికమలములందుఁ బ్రళయకాలంబులందుఁ జొచ్చి
వెడలుచుందురు. బ్రహ్మ పరతత్త్వమని బ్రహ్మగాయత్రీమహా
మంత్రసిద్ధులగువారు బ్రహ్మలోకమందును దపస్సిద్ధులగు
వారు తపోలోకంబున కెగఁబోయినప్పుడు జనలోకవాసులు
మహర్లోకమునండుఁ జేరుదురు. యజ్ఞాదిసత్కర్మనిరతులు
సువర్లోకంబునందును దానధర్మపరోపకారులు భువర్లోకంబు
నందు నుందురు. సూర్యమంత్రోపాసనాసిద్ధులగువారు
సూర్యలోకంబునందును, జంద్రమంత్రోపాసకులు చంద్ర
లోకంబును జేరుదురు. తత్తత్పుణ్యంబులు క్షీణించినప్పుడు
భూలోకంబునం గ్రమ్మఱ నుదయించి జపహేతుకర్మంబులు
సేయుచుందురు. అనిన విని శౌనకాదు లిట్లనిరి.

238


సీ.

వెలయఁ గర్మము లెన్నివిధములై జీవుల
        కేయేశరీరంబు లిచ్చుచుండుఁ
బుణ్యాతిశయమును బుణ్యమధ్యమమును
        బుణ్యసామాన్యంబు భూరిపాప