పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/494

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

487


భక్తి గల్గి వారికిఁ జతుర్విధశుశ్రూషలు చేసి మెప్పించి వారికిఁ
గరుణకుఁ బాత్రులై వేదాంతసిద్ధాంతరహస్యోపదేశంబు
వడసి శ్రవణమనననిదిధ్యాసనపూర్వకంబుగ సంపూర్ణమయ
జ్ఞాన మవలంబించి యజ్ఞానకారణావరణవిక్షేపశక్తులను
గెలిచి శబ్దానువిద్ధ శ్యామవిద్ధ సవికల్ప నిర్వికల్ప సమాధుల
నభ్యసించి జ్ఞానజ్ఞాతృజ్ఞేయంబు లనెడు త్రిపుటిని దాఁటి
సచ్చిదానందనిత్యపరిపూర్ణబ్రహ్మంబునందుఁ బొంది జీవన్ముక్తు
లగుదురు. కామ్యకర్మాచరణులగువారు సుఖదుఃఖకారణంబు
లగు స్వర్గనరకంబులయందుఁ బొంది క్రమ్మరం బుట్టిగిట్టు
చుందురని చెప్పిన విని శౌనకాదు లిట్లనిరి.

240


క.

చటులోగ్రప్రళయంబున
సటమటమై యున్నయప్పు డంభోరాశిన్
వటపత్రమునం దాహరి
యెటువలె వర్తింపుచుండు నెఱిఁగింపుమయా.

241


తే.

అనిన విని సూతుఁ డనియె లయాబ్ధియందు
మహిమమీఱఁగ నంగుష్ఠమాత్రదేహుఁ
డై నిజాంగుష్ఠ మాస్యమం దమర నుంచి
లీల వటపత్రమునఁ బవ్వళించునపుడు.

242


సీ.

పటుతరంగాహతిన్ వటషత్ర మటునిటు
        లుయ్యెలవలె నూఁగుచుండఁగాను
జిరఁజిర నెగరెడు సీకరమాలిక
        లుయ్యెలఁ జేరున ట్లొప్పఁగాను
ఫేనంబు చుట్టుగప్పి విశాలమయ్ది
        యుయ్యెలతెఱవలె నుండఁగాను