పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


ఘనవేంకటాద్రిమార్గంబును జని మహా
        రణ్యంబునం గుమారా యటంచు
పిలుచుచు నేడ్చు చాకలి దప్పి మించుటం
        జేసి నేలం బడి చెవులు మూసి


తే.

కొనియు నప్పుడు గూడ నోకొడుక యెందుఁ
బోతివి యటంచుఁ బలువిడంబులుగ దుఃఖ
పడుచుఁ బేర్కొనుచుండఁగ భవ్యమూర్తి
యిందిరేశుండు చని దయాహృదయుఁ డగుచు.

152


తే.

వృద్ధవిప్రుఁడ యియ్యుగ్రవిపినభూమి
కేల వచ్చితి జగమున నింకఁ గొన్ని
డినము లుండెదవో లేక దేహ మిచట
విడిచెదవో దెల్పు మేడ్వకు జడియ వలదు.

153


క.

అన విని విప్రుం డిట్లనె
ననఘ శరీరంబుమీఁద నాసక్తియు లే
దనిమిషుల ఋణము దీర్పక
చనుటె ట్లనుసందియంబు జనియించె ననెన్.

154


క.

ఆవార్తలు విని మాధవు
డావిప్రునికరముఁ వట్టి యచ్చట గల యా
పావనతీర్థమునందును
గావించెను స్నానమపుడు కరుణాత్ముండై.

155


వ.

అట్లు స్నానం బొనరించుటం జేసి యావృద్ధవిప్రుండు పదియా
ఱేండ్లబాలకుమారుండై, పోడశకళాపరిపూర్ణుండై మ్రోల
నిలిచియుండు శ్రీహరిం జూచి వందనంబు లాచరించుటం జేసి
యద్దేవుండు సహస్రాక్షుండును, సహస్రపాదుండును,