పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

41


డును సహస్రమార్తాండప్రభాభాసితుండును వపాపరిమళ
మిళితాధరుండును గరుణాకటాక్షవీక్షితుండును నగు హరి
మునీంద్రులం జూచి మీసేయుజన్నంబున నత్యంతతృప్తి
నొందితి నని పల్కి, మోహినీరూపిణి యగునిందిరాదేవిం
గూడి తిరోధానంబునొందె. ననంతర మమ్మునిపుంగవులు
పరమానందవిస్మితాంతరంగు లై హరివేడబంబునకుఁ గొం
డొకతడవు హరిం బ్రార్థించి కృతార్థుల మైతి మనుచు
జన్నంబు పరిపూర్తిచేసి యపభృతస్నానం బొనర్చి రని
సూతుండు వెండియు మునుల కిట్లనియె.

149


మ.

మును జాబాలిమునీంద్రుఁ డీకథను సమ్మోదంబుతో నాకుఁ జె
ప్పెను నే నట్లుగ మీకుఁ జెప్పితిని సంప్రీతిన్ రమేశుండు చే
సిన దింకొక్కటి చెప్పెదం గథ మహాచిత్రంబుగా మీరు ము
న్వినినట్లే యని శౌనకాదులు విన న్వేడ్కం దగం దత్కథన్.

150


వ.

వినిపింపఁ దొడంగె, నంత శ్రీహరి తద్గిరి కుత్తరభాగమం
దార వట వకుళ చందన పిచుమంద జంబు జంబీరాద్యనేక
తరుబృందశోభితారణ్యాంతకంబున విహరించు చుండుసమ
యంబున నొక్కదినంబున.

151


కుమారధారమహిమ

సీ.

దేశాంతరాగతద్విజుఁడు వృద్ధవయస్కుఁ
        డత్యంత బలహీనుఁ డతనిసుతుఁడు
కౌండిన్యుఁ డనువానిఁ గానక యందందుఁ
        దడవుచు వచ్చి దా దారి దప్పి