పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

43


సహస్రశీర్షుండును, సహస్రబాహుండును నై, నిజస్వరూపం
 బక్కుమారవిప్రునకుం జూపుటం జేసి గగనంబుననుండి దేవేంద్రాదులు దేవదుందుభులు మొరయించిరి శీర్షంబునఁ బుష్పవృష్టి గురియించిరి పలువిధంబుల నుతించి రప్పు డవ్విశ్వరూపుం డగుచక్రి యవ్విప్రుం జూచి యో భూసురకుమారా! యిజ్జగంబున ధనధాన్యసమృద్ధితో నిఁక దేవఋణంబు దీర్చుటకు నాశ్రమంబునకుం జని యాగంబుసేయు మని యానతిచ్చి యతనికుమారుం డగు కౌండిన్యునియున్కి నెఱింగించి యంతర్ధానంబు నొందె నంత నవ్విప్రపుంగవుం డత్యంతానందసుధాంబుధి నోలలాడుచు హరిం గొనియాడుచుఁ దనయెడకుం జనియెఁ దత్కారణంబుననందుండు ధారాతీర్థంబుసకు గుమారధారాతీర్థం బనంబరగె. మఱియు నాకుమారధారాతీర్థంబునఁ ద్రికాలస్నానం బాచరించిన వారికినరోగదృఢకాయంబును, నవృద్ధత్వంబును, సకలసౌభాగ్యపుత్రావాప్తియు నగు నని యమరులు నిర్ణయించి నిజస్థానంబుల కేగిరంచు జాబాలి నాకిక్కథ వక్కాణించుటం జేసి చెప్పితినని వెండియు నిట్లనియె.

156


సీసమాలిక.

వాల్మీకి నాకుఁ బూర్వచరిత్ర మొక్కండు
        చెప్పె దానిని వినుఁ డొప్పుగాను
చంద్రవంశజుఁ డైన శంఖణుఁ డసురాజు
        కాలవశంబున బేల యగుచుఁ
దనశత్రువుల కొగిఁ దనరాజ్యమును గోలు
        పోయి రామేశ్వరంబునకుఁ జేరి