పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/480

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

473


ననినఁ గృష్ణుని జూచి హలపాణి పల్కె నీ
        వును రమ్ము నావెంట ననఁగఁ గృష్ణ
దేవుఁ డిట్లనె రమాదేవి నిందొంటిగ
        నుంచి నే వచ్చుట కుచిత మగునె


తే.

యంచుఁ గృష్ణుండు వల్కఁగ హలధరుండు
పరఁగ నిట్లనెఁ గరవీరపురము జేరి
యొంటిగా నీమహాలక్ష్మి యుండినపుడు
నీవు తోడుగ నుంటివే నిర్మలాత్మ.

202


చ.

అని హలసాణి పల్క నపు డల్లన నవ్వుచుఁ గృష్ణ దేవుఁ డి
ట్లనె సిరి దవ్వుగా నిలచినప్పటిరీతిఁ దలంప నేల యిం
దొనరఁగఁ జేరి యున్న దిపు డొంటిగ నిచ్చట నుంచి నేను బో
యిన జను లైన నవ్వరె యహీంద్రగిరీశ్వరుఁడైన మేచ్చునే.

203


తే.

మనకు భయమేమి యిచట రమాలలామ
విభవములు చూచుచుందము వేడ్క నిలచి
యనిన బలభద్రుఁ డామాట విని భయమును
జెంది శ్రీకృష్ణదేవు నీక్షించి పల్కె.

204


సీ.

భృగుమునీంద్రుని పూర్వమగుడు సేయుచుఁ బర
        పురుషుఁ డంచును మదిఁ బెరికియుంచి
హరిఁ బాసి కరవీరపురిఁ జేరి పాతాళ
        మున కేగి విభునిచేతనె తపంబు
చేయించి తపము దాఁ జేసి యీస్థలమందుఁ
        జేరి యిచ్చట నిల్చె వీరలక్ష్మి
యసఁగాఁ బ్రసిద్ధమై హరివలెనే చతు
        ర్భుజములతో మహాస్ఫురణ మెఱయ