పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/479

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

472

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


చ.

అపుడు శుకాగ్రహారవరమందు శుకుం డతిభక్తి మీఱఁగా
నెపుడు మహోత్సవక్రమము లిందిర కిచ్చట నాచరింపఁగా
నపరిమితంబుగాఁ గలుము లందఱ కిచ్చుచుఁ బూజలందుచున్
విపులసుఖస్థితిన్ నిలిచి వీరరమామణి యుండె నచ్చటన్.

199


సీ.

అంతకుముందుగ నాదిశుకుం డందుఁ
        జేరినప్పుడ భూప్రసిద్ధముగను
బలరామకృష్ణుల భక్తిమై భావించి
        యందుంచి పూజించి యతఁడు చనిన
వెనుక ఛాయాశుకుం డనెడు విప్రుఁడు పాంచ
        రాత్రోక్తముగ రమారమణి నచట
నర్చింపఁ బరకాంత యగులక్మి హరిచెంతఁ
        జేరియుండక యిందుఁ జేరినపుడు


తే.

నే నిచట నిల్చియుండుట నీతి గాదు
తిన్నఁగా లేచి యిప్పుడ తీర్థయాత్ర
చనుదు నని సీరి లేచె నాసమయమునను
బట్టి కృష్ణుఁడు గూర్చుండఁబెట్టె నతని.

200


క.

అప్పుడు కృష్ణునిఁ గని బలుఁ
డప్పా కూర్చుండఁబెట్ట నర్హం బగునే
గొప్పై పరసతి వేడ్కఁగ
నిప్పుడు దా నిందు నిలిచె నింపుఁ దలిర్పన్.

201


సీ.

కావున నేను వేంకటగిరిపై కేగి
        యందొకతీర్థంబు నాశ్రయించి
యుండెద ననఁగ న న్నొంటిగ నిందుంచి
        యోయన్న పోనేల యుండు మిచట