పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/472

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

465


నప్పుడు సూర్యునియందుఁ జెందునని మద్గురుం డుపదేశించె
ననిన విని సూర్యుం డిట్లనియె.

176


తే.

దేవరాక్షసముఖుల సుస్థితిలయముల
వరుసగాఁ జెప్పు మనఁగ నవ్యాససుతుఁడు
జలజబాంధవు నీక్షించి సంతసించి
మఱల నిట్లని పల్కె నెమ్మనముగాను.

177


వ.

దేవా వటబీజంబునకు భూసంబంధం బొక్కటి యైనఁ గాని
వ్రీహిపరిణామంబు షాణ్మాసంబులను వటపరిణామంబు సహస్ర
సంవత్సరపర్యంతంబు గల డాప్రకారంబు బ్రహ్మాదిదేవశరీర
ములకును మసుష్యశరీరంబులకును గాలభేదం బున్నయది,
ఆహిరణ్మయతేజస్సత్త్వాంశం బధికంబుగాఁగ నిలావృత
ఖండాదిదేశంబులయందు దేవజాతులు తృప్తియై దీర్ఘా
యుష్మంతులై వర్తింతురు. సామాన్యదేవజాతులకు సుర్మా
వధియు నింద్రాదులకు మన్వంతరావధియు బ్రహ్మాదులకు
బ్రహ్మాండప్రళయావధియుఁ గల్గియుండు నంతటికి నాధారమై
సచ్చిదానందనిత్యపరిపూర్ణుండై వాఙ్మానసాతీతుం డైననారా
యణుండు ప్రకాశించుఁ దత్ప్రకాశంబు నీవ నిశ్చయించి
యుందుసని మఱియు సకలవేదాంతసారనిశ్చితార్థానుభవ
క్రమంబు విన్నవింప విని సూర్యుండు శుకుం జూచి యిట్లనియె.

178


సీ.

ఓ మహామౌనీంద్ర నీమనోదార్ఢ్యంబు
        యోగసిద్ధియుఁ దెలియుటకుఁ జాల
నాక్షేపములు చేసి యడిగితి నన్నిటి
        కన్ని యుత్తరము లీ వనుభవముగఁ