పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/471

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

464

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


దా మేఘ మగుచుఁ జంధ్రరసాత్మకంబైన
        జలముచేఁ బూర్ణమై చల్ల నగుచు


తే.

వర్షధారలు నిండింప వసుధయందు
సస్యములు వృద్ధి బొందు సస్యములయందు
సారతరమైన ఘనజీవసత్తు నిలిచి
ధాన్యమై మర్త్యతతుల కోదనము నగును.

175


వ.

మఱియు దృఢరసమై పశువుల కన్నం బగు వివిధఫల
రూపంబుల నొంది విహంగాదిజంతువుల కన్నంబగు వాయు
రూపంబై సర్పాదుల కన్నంబగు నయ్యన్నంబు తత్తద్భూతం
బులయందుండు జఠరాగ్నివలనం బచనంబై పాలలో
ఘృతంబు పైకిఁ దేలినవిధంబున బిందురూపమై పుర్షులయందు
నిలిచి స్త్రీగర్భంబులం జొచ్చి పిండరూపంబగు తత్పిండంబుల
యందు జరాయుసంబంధమువలన మాతృధాతృసంబంధము
వలన షాణ్మాసంబులు వహ్ని దానియందుఁ బ్రకాశంచుకరణిఁ
జైతన్యంబు దీపించుఁ దదనంతరంబు గాలకర్మపరిపూరితం
బైనతఱి సుదయించు, మఱియు నవ్వర్షజలంబే వృక్షముల
యందు రసాత్మకంబై జీవనంబగు నీయుత్పత్తిప్రకారం బింక
లయప్రకారంబెట్లనిన, వాతపిత్తశ్లేషాదిరోగంబులవలన
భూతంబులు లోఁబడినప్పుడు పల్లముల నిలచిన వర్షజలం
బుల సూర్యకిరణంబులు పీల్చుకరణిఁ గాలస్వరూపమగు
సూర్యుఁడు సర్వభూతంబుల యందలి జీవరసంబుం బీల్చి
వోవునప్పు డారసస్వరూపంబు సూర్యకిరణంబులందు మిళి
తమై వాయుమండలంబున నేకమై గగనమార్గంబునఁ జంధ్ర
మండలంబునం జొచ్చి చంద్రుడు సూర్యునియం దేకీభవించి