పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/473

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

466

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


జెప్పితి వందుచేఁ జిత్తంబు రంజిల్లె
        మహితాత్మ నీవు నామండలంబు
లోఁ జొచ్చి వెడలి పైలోకంబులను దాఁటి
        పట్టిపైనుండెడు పరమపదము


తే.

నందుఁ బొందు మటంచు నయ్యబ్జసఖుఁడు
చాల మన్నింపఁగా శుకసంయమీంద్రుఁ
డచలితానందరసమగ్నుఁ డగుచు లేచి
దినకరునిమండలంబు భేదించి వెడలి.

179


వ.

తదనంతరంబున నూర్ధ్వమండలంబుల నూర్ధ్వలోకంబుల
నతిక్రమించి శుకుఁడు నిర్వాణపదంబు నొందె నంత ఛాయా
శుకుండు కాశి చేరి వేదవ్యాసులకు వివిధశుశ్రూషాదులు
చేయుచుండి కొన్నియుగంబుల కాకృష్ణద్వైపాయనుని
యనుమతంబున శుకాశ్రమస్థలంబునందుఁ జేరి వివాహంబు
చేసికొని సంతానంబు వడసె నని దేవదర్శనుండు చెప్పిన విని
దేవలుండు విని యిట్లనియె.

180


తే.

శ్రీరమాదేవి పూర్వశరీరకలిత
యై తపము కపిలాశ్రమమందుఁ జేయు
చుండె నంటివి మఱల నీయుర్విమీఁదఁ
జేరినటువంటికథ నాకుఁ జెప్పుమయ్య.

181


మ.

అని యా దేవలమౌని తా నడుగఁగా నాదిత్యయోగీంద్రుఁ డి
ట్లనె నాదేవి సుశీలయై హృదయమం దాచక్రి నర్చింపుచున్
మన మాస్వామిపదారవిందములపై మగ్నంబు గావించుచున్
దనదేహస్మరణంబు లేక జగముల్ దైత్యారిరూపంబుగన్.

182