పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/457

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

450

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


పద్మావతి సకలభూషణాంబరాలంకృతయై తదానందనిల
యంబునం బ్రవేశించి హరికి సిరికి నమస్కరించి, నంతఁ బద్మా
లయ పద్మావతిని దీవించి చెంత నుంచుకొని వకుళను విశ్వా
సంబుఁ జూపి యిచ్ఛామాత్రంబున సకలపదార్థంబుల నాకర్షించి
బ్రహ్మాదులకు విందు చేయించి సువస్త్రభూషణాదుల నొసంగి
సంతుష్టులం జేసి మునులను గౌరవింప, నందఱు తమ నివాసం
బుల కరిగిరి, వెన్నడి వేంకటేశ్వరుండు లక్ష్మీపద్మావతుల
తోడం గూడి సుఖంబుండి యొక్కనాఁడు వినోదంబుగ లక్ష్మిం
జూచి యిట్లనియె.

136


తే.

శ్రీరమాదేని నీవు వచ్చినకతమున
నాకు సంతోషమయ్యె నానాఁడు ధనదు
చేతఁ దీసిన ఋణము దీర్చెడునుపాయ
మేమి నా కిప్పు డెఱిఁగించు మిందువదన.

137


క.

అనుచు వినోదంబుగ నా
వనజాక్షుం డడుగ నపుడు వనజాలయ యి
ట్లనె ఋణము సేయునప్పుడు
నను నడిగితివే యటంచు నగి మఱి పలికెన్.

138


మ.

అనఘా పెండ్లికి నేను వచ్చినపు డిం దర్థంబు లేదంచుఁ జె
ప్పినఁ ద ప్పే మటు చెప్పిన న్ధనము నేఁ బ్రే మారఁగా నియ్యనే
నను నీ వప్పుడు తేరఁ జేసి ధనదు న్నాపెండ్లి కీ వర్థ మి
మ్మని యాచించి ఋణంబు సేయుపని కేమందున్ జగన్నాయకా.

139


క.

అపు డఱమఱఁ జేయఁగఁ గద
కపటాత్ముఁడ ననుచుఁ దెలిసి కరవీరపురం