పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/458

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

451


బుపశమముం జేరితి నొగిఁ
జపలతఁ బాతాళమునకుఁ జనుట మహాత్మా.

140


ఉ.

నావుడు వెన్నుఁ డిట్లనియె న న్నెడఁబాసినజాలిచేత నే
నీ వతిచింత నొందఁగను నెమ్మి ధనంబును గూర్చి పెండ్లికిం
గావలెనంచు ని న్నడిగి కైకొనలేదు కడంగి యోరమా
దేవి మఱద్ది తప్పనుచుఁ దేరగఁ జూడకు మింకఁ బల్కఁగన్.

141


శా.

ఆమాటల్ విని లక్ష్మి యిట్లనియె నాఁ డారీతి నయ్యెంగదా
యామీఁదం దడవైన వడ్డి బరువై యాపత్తురా దేమి నీ
కీమర్యాదను నిల్పనుండిన ధనం బీవేళ నే నిచ్చెదన్
స్వామీ వానిఋణంబు దీర్చు మనినన్ సంతోషసంయుక్తుఁడై.

142


సీ.

హరి యిట్టు లనె నీ మహామహిమంబు నే
        నెఱుఁగనె మును క్రొత్త యేమి తలఁప
నిపుడు కుబేరుని కీనర్థ మీ నేల
        నానాఁటి వడ్డి నిర్ణయముగాను
గ్రమముగ నిచ్చుచుఁ గలియుగాంతంబునం
        దంతయుఁ దీర్చి విశ్రాంతి నొంది
వైకుంఠపురిఁ జేరవచ్చునంతకు శేష
        శైలమం దుండి భూజనులనెల్లఁ


తే.

బాలనము చేసి వారిపాపముల నింకఁ
బరిహరింపుచు రక్షింపవలయు నెలమిఁ
గాన నయ్యప్పు తలఁప శీఘ్రంబ యీయ
వల ద దెట్లన్న విను ప్రేమ వఱల నిపుడు.

143


సీ.

కలియుగంబునఁ బాపకర్మంబు లొనరించు
        ప్రజకు రోగాది తాపత్రయములు