పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/442

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

435


సీ.

అని వకుళాదేవి యచట పద్మావతి
        నాదరింపుచునుండె నంత లక్ష్మి
కపిలాశ్రమంబులోఁ గన్పట్టఁ బద్మావ
        తీదేవి చింతఁ దాఁ దెలిసి చక్రి
తలఁచి నాకై మేటితపము సేయఁగ నేల
        యాకాంత కొండపై నడల నేల
యని చింత సేయుచు నందుండు కపిలము
        నీశ్వరు నీక్షించి యిట్టు లనియె


తే.

మౌని పద్మావతిం బెండ్లి మాధవుండు
చేసుకొని దాని విడనాడి చెలఁగి నన్నుఁ
గూర్చి తప మొనరించుచుఁ గొంకుమాని
యుండువాఁ డేమి సేయుదు యోగివర్య.

81


వ.

అనిన విని యమ్మునీశ్వరుం డిట్లనియె.

82


క.

హరియురమున వసియింపక
సిరి నీ వపు డలుగ నేల చిత్రముగద! యా
సరవిం జెప్పుము విని నీ
కరయఁగ నంతయును జెప్పె దంబుజనయనా.

83


క.

అని కపిలుం డపు డడుగఁగ
విని శ్రీసతి యిట్టులనియె వెన్నుని యురమం
దొనరఁగ నే నుండఁగ భృగు
ముని హరియురమందుఁ దన్నె మూఢాత్ముండై.

84


క.

పరుఁడగు పుర్షునిపాదం
బరుదుగఁ దాఁకిన యురంబునందుండిన నా