పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/440

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

438

షష్ఠాశ్వాసము


సీ.

దనుజారి యచ్చట తనమాయచేఁ బుట్టి
        నట్టిశక్తిం జూచి యచలుఁ డగుచుఁ
బలికె నిట్లని నీవు ప్రజలచే నిందందుఁ
        బూజలందుచు నుండు పొమ్మటంచుఁ
దా దాని పంపించి తదనంతరంబున
        జిష్ణుండు నేనక చేసినట్టి
పనికిఁ గోపింపక తనయుని జనకుండు
        గాచినకైవడి బ్రోచె నంత


తే.

శాంతమానసుఁడై హేమజలజమునన
పూర్వరీతిని మఱల సంపూర్ణదృష్టి
నిల్పి చలియింప కత్యంతనిష్ఠ మెఱయఁ
దపము సేయుచు నుండె నాదానవారి.

73


తే.

అచటఁ బద్మావతీదేవి హరిని బాసి
నది మొదల్ నిద్ర లేక యాహారమైన
లేక యాచక్రధరునిపై నాసతనరి
వికహతాపజ్వరంబుచే వేగుచుండి.

74


క.

ఇరువదిరెండేం డ్లాయెను
హరి యిచటికి రాకమానె ననుకొని చింతం
బొరలుచు మఱచుచుఁ దెలివిన్
దొరకొని యొకనాఁడు వకుళతో నిట్లనియెన్.

75


మ.

వకుళా వెన్నుఁడు నన్ను శేషగిరిపై వర్తింప నేమించినాఁ
డకలంకంబుగ మాటలాడి చని రాఁ డయ్యె న్మహాచింతచే
నొకనాఁ డొక్కయుగంబుగాఁ గడపలే నోయమ్మ నాప్రాణనా
యకుఁ డాలక్ష్మిని గూడి యెం దరిగినాఁ డంచు న్విచారించుదున్.

76