పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/439

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

432

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


ల్లఁగ మాటాడుచు విస్మయం పడుచు శ్రీలక్ష్మీశ్వరుం బాసి యా
మృగనేత్రల్ సని నాక నాయకుని సామీప్యంబునం జేరఁగన్.

69


క.

వారిం గని పురుహూతుఁడు
నారీమణులార ధరను నరపతితపమున్
వారించితిని గదా యన
నారంభాస్త్రీలు ఖేద మందుచు నపుడున్.

70


సీ.

పలికి రిట్లని నీవు పంపింపఁగాఁ బోయి
        నరపతి యనుచు నానావిధములఁ
దలకొని నృత్తగీతము లెంతఁ జేసిన
        మాదిక్కుఁ జూడక మహిమ మెఱయఁ
దనచెంత విశ్వమోహినిని బుట్టించినాఁ
        డాకాంత కన్న మే మందఱముసు
దక్కువైనందునఁ దగ్గి వచ్చితి మిట్లు
        చిరతరతపము చేసెడు ఘసుండు


తే.

మనుజుఁ డనియుంటి మతఁడు రమావిభుండు
గనుక చలియింపకున్నాఁడు కాముఁ డతని
కదరి చనినాఁడు తత్తపం బతిశయించి
యున్న దిది నిక్క మోపురుహూత యనిన.

71


ఆ.

విని సురేశ్వరుండు విస్మయస్వాంతుఁడై
చక్రి తపముచేయు సరవి మఱచి
యేను జేసి తిప్పు డిటువంటి యపచార
మనుచు హరికి మ్రొక్కి వినుతి చేసె.

72