పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/429

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

422

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


మ.

ననుఁ గొల్లాపురమందుఁ జేర్పుఁ డచట న్నానాప్రకారంబులన్
వనజాతాలయ కొప్పఁ జెప్పి మఱి సర్వంబు న్సమర్పించి ర
మ్మని నేఁ దోడ్కొని వత్తు నన్న దరహాసాస్యంబు దీపింప న
వ్వనజాతాక్షుఁడు సంతసం బెసఁగ నవ్వామాక్షితో నిట్లనెన్.

28


క.

సతి నీలలితోక్తికి నా
కతిసంతస మయ్యె వకుళ యలరఁగ దోడన్
హితముగ నుండుము నే నా
సతి దోడ్కొనివత్తు నిటకు సంప్రీతి తగన్.

29


వ.

అని శ్రీనివాసుండు నిశ్చయించె నట్టి వృత్తాంతంబు లక్ష్మి
భావించి తనలోఁ దా నిట్లు వితర్కించె.

30


సీ.

శ్రీవేంకటేశుఁ డాశ్రితజనావనుఁ డింక
        నిందుండ నీయ కహీంద్రగిరికి
నను సత్కృపం దోడుకొని పోవుటకు వచ్చు
        నపుడు నేరాను బొమ్మనుచు నాకు
నోరాడ దిప్పుడ గారవంబుగ డాఁగ
        వలయునే నాస్వామివక్షమందుఁ
బగలు రేయుండిన పద్మావతికిఁ జింత
        గలుగ నాకేల నీకర్మ మంచు


తే.

రయమునను లేచి కొల్లాపురంబు విడచి
దారి తప్పక యరిగి పాతాళమందుఁ
జేరి హరియంశుఁ డయ్యు విశేషయోగ
మహిమచే నొప్పు కపిలాఖ్యమౌనిఁ జేరె.

31


క.

అపు డాలక్ష్మిని గన్గొని
కపిలమునీంద్రుండు మిగుల గౌరవముగ న